పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన…. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల మీద కక్షసాధింపు చర్యలు తమ ప్రభుత్వం చేయలేదన్న ఆయన… ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్చగా పోటీ చేసి ఓట్లు అడిగారని తెలిపారు.

రాష్ట్రంలోని పేద ప్రజలకు తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి కారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2029లోనూ ఇదే మాదిరి ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు. 2/3 మెజార్టీతో 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 1/3తో బీఆర్ఎస్ ఉంటే 2/3 మెజార్టీతో కాంగ్రెస్ ఉంటుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
చర్చించి నిర్ణయం తీసుకుంటాం - సీఎం రేవంత్ రెడ్డి
ఇక రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో అసెంబ్లీ పెట్టి నిర్ణయిస్తామన్నారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటామని… 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తామన్నారు. ప్రజాస్వామ్యయుతంగా చర్చించి… ఎన్నికలపై ఓ నిర్ణయాానికి వస్తామని క్లారిటీ ఇచ్చారు.
తమకు 7,527 గ్రామ పంచాయతీల్లో (66 శాతం) ప్రజలు అందించిన ఆశీర్వాదం.. ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల ఆశీర్వాదంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండిండినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు.
ఒకవైపు ఆదాయాన్ని పెంచుకుంటూ దుబారాను తగ్గిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరక్కుండా ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి బదులిచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులకు సంబంధించి పూర్తి వివరాలతో శాసనసభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని క్లారిటీ ఇచ్చారు.
{{/usCountry}}ఒకవైపు ఆదాయాన్ని పెంచుకుంటూ దుబారాను తగ్గిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరక్కుండా ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి బదులిచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులకు సంబంధించి పూర్తి వివరాలతో శాసనసభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని క్లారిటీ ఇచ్చారు.
{{/usCountry}}