మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 90 సీట్లు గెలుచుకుని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగి స్థానాల సంఖ్య పెరిగితే ఏకంగా 117 స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

నల్గొండ జిల్లా నకిరేకల్లో శనివారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తన విద్యార్హతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. "కాంగ్రెస్ కార్యకర్తలు నీకు తిరుగులేని రీతిలో సమాధానం చెబుతారు. వారు ఎన్నడూ వెనకడుగు వేయరు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ శ్రేణులు రాజకీయంగా బొందపెడతాయి. ఇది నీవు జీవితాంతం గుర్తుంచుకోవాలి. కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం రా" అని సవాల్ విసిరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఉన్న రాజకీయ చరిత్రను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ (1994-2004) రెండుసార్లు, కాంగ్రెస్ పార్టీ (2004-2014) రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చాయని తెలిపారు. అలాగే తెలంగాణ సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ (2014-2024) రెండు విడతలు పాలించిందని గుర్తు చేశారు. అదే రీతిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 2028 ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి వరుసగా అధికార పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. స్థానాల సంఖ్య 119గానే ఉంటే 90 సీట్లు, పెరిగితే 117 సీట్లు సాధిస్తామని చెప్పారు.
కేసీఆర్ రాజీనామా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. డిసెంబర్ 2023లో అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ చట్టసభలకు దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నేత పదవికి ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. "సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా 365 రోజులు విధులకు హాజరుకాకపోతే సర్వీస్ నుంచి తొలగిస్తారు. మరి రెండేళ్లుగా సభకు రాకుండా దాదాపు రూ. 22 కోట్ల జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు పొందిన కేసీఆర్ను ప్రతిపక్ష నేత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదు?" అని ప్రశ్నించారు.
{{/usCountry}}సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. డిసెంబర్ 2023లో అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ చట్టసభలకు దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నేత పదవికి ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. "సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా 365 రోజులు విధులకు హాజరుకాకపోతే సర్వీస్ నుంచి తొలగిస్తారు. మరి రెండేళ్లుగా సభకు రాకుండా దాదాపు రూ. 22 కోట్ల జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు పొందిన కేసీఆర్ను ప్రతిపక్ష నేత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదు?" అని ప్రశ్నించారు.
{{/usCountry}}కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, హరీష్ రావు నియోజకవర్గమైన సిద్ధిపేటల్లో కాంగ్రెస్ తరఫున భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ను సీఎం వేదికపైనే ఆదేశించారు. "రాష్ట్రంలో బీఆర్ఎస్ను మళ్లీ కోలుకోకుండా చేస్తాం," అని స్పష్టం చేశారు.
తనను సంస్కారం లేనివాడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న కేటీఆర్ వైఖరిని సీఎం ఎండగట్టారు. "నేను సంస్కారం కలిగిన వ్యక్తిని కాబట్టే బీఆర్ఎస్ నేతలు నేడు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు," అని వ్యాఖ్యానించారు. కుటుంబ ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టం లేకే సొంత చెల్లెలు కవితను కేటీఆర్ బయటకు నెట్టేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. "తెలంగాణ ఉద్యమ సమయంలో తాను రాష్ట్రానికి కాపలాదారుగా ఉంటానని కేసీఆర్ చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకున్నారు," అని మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలు నుంచి విడుదలై హైదరాబాద్ వచ్చిన కవితను.... ఆమె సోదరుడు కేటీఆర్ ఇంటి నుంచి బయటకు పంపించి, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వ్యక్తి, కోటి మంది మహిళల సంక్షేమం కోసం ఏం పనిచేస్తారు?" అని నిలదీశారు. కుమార్తెను పంపించేసినా, కేటీఆర్ భయంతోనే కేసీఆర్ ప్రస్తుతం ఫామ్హౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు రుణాలు రద్దు చేయడం, రైతు భరోసా పెట్టుబడి సాయం, మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సాధికారతకు తీసుకుంటున్న చర్యలను సభలో వివరించి, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.