Telangana 22A Prohibited Lands Registration : రాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రజలను వేధిస్తున్న 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి నిషేధిత భూముల జాబితా, రిజిస్ట్రేషన్ల అంశంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ ఆస్తులున్న యజమానులు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రెండు రోజుల్లోనే పరిష్కారం…

రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న యజమానుల ఆస్తులు ఒకవేళ 22-ఏ నిషేధిత జాబితాలో కనిపిస్తే, రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగుతారు. కేవలం రెండు రోజుల్లోనే ఆ భూమికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సదరు స్థలం లేదా భూమి ప్రైవేటు వ్యక్తులదని తేలితే… ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.
కేవలం తాత్కాలిక ఉపశమనమే కాకుండా, ఈ సమస్యకు శాశ్వత విముక్తి కల్పించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలోని 22-ఏ జాబితాలో ఉన్న భూములను స్వయంగా, క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రైవేటు భూములు తప్పుగా ఈ నిషేధిత జాబితాలో చేరి ఉంటే వాటిని వెంటనే తొలగించి… ఎలాంటి తప్పులకు ఆస్కారం లేని పక్కా నివేదికను, సరైన జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమగ్ర ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని స్పష్టం చేశారు.
దళారులను నమ్మవద్దు…
భూ హక్కుల విషయంలో తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. "ప్రజల ఆస్తి హక్కులను కాపాడటానికి మన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములకు సంబంధించి ఒక్క అంగుళం స్థలానికి కూడా ఇబ్బంది రానివ్వం" అని సీఎం హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో ప్రజలను హెచ్చరించిన ముఖ్యమంత్రి…. 22-ఏ భూముల క్లియరెన్స్ లేదా రిజిస్ట్రేషన్ల పేరుతో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. సోషల్ మీడియాలో లేదా బయట ప్రచారంలో ఉండే ఎలాంటి పుకార్లను, కట్టుకథలను విశ్వసించవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పనులు జరుగుతాయని తెలిపారు.
{{/usCountry}}ఇదే సమయంలో ప్రజలను హెచ్చరించిన ముఖ్యమంత్రి…. 22-ఏ భూముల క్లియరెన్స్ లేదా రిజిస్ట్రేషన్ల పేరుతో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. సోషల్ మీడియాలో లేదా బయట ప్రచారంలో ఉండే ఎలాంటి పుకార్లను, కట్టుకథలను విశ్వసించవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పనులు జరుగుతాయని తెలిపారు.
{{/usCountry}}