పరీక్షలకు సంబంధించిన లోపాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. వారం రోజుల తర్వాత ఆ పార్టీ దేశవ్యాప్తంగా వరుస శాంతియుత నిరసన కార్యక్రమాలను ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో కూడా నిరసన జరగనుంది.

తాజాగా సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 11, జూన్ 20 మధ్య ఏడు నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్లో నిరసన కార్యక్రమం జూన్ 14న ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ వద్ద జరుగుతుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల పేపర్ లీకేజీలు, సీబీఎస్ఈ మార్కింగ్ విధానంలో అవకతవకలపై దేశ రాజధాని దిల్లీలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకుని సరికొత్త వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆధ్వర్యంలో జూన్ 6న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమం జరిగింది. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటుందని, కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభీజిత్ దీప్కే నేతృత్వం వహించారు. అమెరికాలోని బోస్టన్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న ఆయన.. దేశంలోని విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై స్పందించి ప్రత్యేకంగా దిల్లీ చేరుకున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆత్మకథ పుస్తకాన్ని చేతబూని దిల్లీ ఎయిర్పోర్టులో అడుగుపెట్టిన ఆయన.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో శాంతియుత పద్ధతిలో జంతర్ మంతర్ వద్ద పోరాటాన్ని ప్రారంభించారు.
దిల్లీ పోలీసులు ఈ నిరసనకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కఠిన నిబంధనలతో కూడిన ఒకేసారి మినహాయింపు అనుమతి ఇచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ ఈ ఆందోళన కొనసాగింది.
{{/usCountry}}దిల్లీ పోలీసులు ఈ నిరసనకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కఠిన నిబంధనలతో కూడిన ఒకేసారి మినహాయింపు అనుమతి ఇచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ ఈ ఆందోళన కొనసాగింది.
{{/usCountry}}జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా పలు డిమాండ్లు చేశారు. పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. వరుస లోపాలతో విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ పోర్టల్లో ఉన్న లోపాలను సరిదిద్ది పారదర్శకతను పెంచాలన్నారు.
నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్య అస్త్రాలు సంధించారు. 'మేము మిమ్మల్ని మేక్ ఇన్ ఇండియా అడిగితే.. మీరు మాకు 'లీక్ ఇన్ ఇండియా' ఇచ్చారు.' అంటూ రాసి ఉన్న పోస్టర్లు జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు దేశంలోని ముఖ్యమైన నగరాల్లోనూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ప్లాన్ చేసింది.