వడదెబ్బతో మరణిస్తే రూ.4 లక్షల పరిహారం.. ఎలా అప్లై చేయాలి, ఏమేం పత్రాలు కావాలి?

Heatstroke Compensation : రాష్ట్రంలో సూరీడు దంచికొడుతున్నాడు. బయట అడుగుపెట్టాలంటే వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ కాలంలో వడదెబ్బతో చాలామంది మరణిస్తారు. వడదెబ్బతో మరణిస్తే.. బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం పొందవచ్చు.

Updated on: May 4, 2026, 15:55:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు సామాన్యులు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఎండలో తిరిగే కూలీలు, బాటసారులు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి కష్టకాలంలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 4 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

వడదెబ్బతో మరణిస్తే పరిహారం
వడదెబ్బతో మరణిస్తే పరిహారం

ఈ పరిహారం ఎవరికి వస్తుంది? ఎలా దరఖాస్తు చేసుకోవాలో సామాన్యులకు అర్థమయ్యేలా పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

వడదెబ్బతో మరణిస్తే రూ. 4 లక్షల పరిహారం

వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) ద్వారా ప్రభుత్వం ఈ ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఈ 4 లక్షల పరిహారం అందాలంటే కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. వ్యక్తి మరణించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష చేయించాలి. రిపోర్టులో 'వడదెబ్బ వల్లే మరణం సంభవించింది' అని స్పష్టంగా ఉండాలి.

కావాల్సిన పత్రాలు

  • ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన శపపరీక్ష రిపోర్టు కావాలి.
  • వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించాలి.
  • మరణించిన రోజున ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ (IMD) ధ్రువీకరించాల్సి ఉంటుంది.
  • మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ఇచ్చిన మరణ ధ్రువీకరణ పత్రం.
  • మృతుడి, కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డుల జిరాక్సులు (Aadhaar etc.).
  • పరిహారం జమ కావడానికి బ్యాంకు పాస్‌బుక్ వివరాలు.
  • వారసుల వివరాల కోసం కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం.

దరఖాస్తు ఎలా చేయాలి?

  • మరణం సంభవించిన వెంటనే స్థానిక VRO లేదా తహసీల్దారు కార్యాలయానికి సమాచారం అందించాలి.
  • పైన చెప్పిన పత్రాలన్నింటినీ జతచేసి తహసీల్దారు ఆఫీసులో దరఖాస్తు అందజేయాలి.
  • రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆ నివేదికను జిల్లా కలెక్టరుకు పంపిస్తారు.
  • కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత, రూ. 4 లక్షల పరిహారం నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో జమవుతుంది.

ఎండలు తీవ్రంగా ఉన్నందున అనవసరంగా బయటకు రావద్దు. ఒకవేళ వడదెబ్బ కారణంగా ప్రమాదం జరిగితే, ఆలస్యం చేయకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుని మీ కుటుంబాన్ని ఆదుకోండి.

ఇక వేసవిలో శరీరంలో నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్తుందనే విషయం తెలిసిందే. దీని కారణంగా ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి తీసుకోవాలి. చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. కానీ దీనివల్ల ప్రయోజనం ఉండదు. కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది. ఐస్​క్రీంలు, కూల్​డ్రింక్స్​కు దూరంగా ఉండాలి. ఫాస్ట్​ఫుడ్, బర్గర్లు, ఫ్రైడ్​ రైస్​లు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More