రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియకు ఇవాళ్టి(ఆగస్ట్ 10,2026)తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు ఫారాలు సమర్పించని ఓటర్లకు ఈరోజే ఆఖరి అవకాశమని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఫారాలు నింపి బీఎల్వోలకు ఇవ్వకపోతే రాబోయే ఓటరు జాబితాలో పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటివరకు లెక్కలు ఇలా….

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకు 2.64 కోట్ల మంది వివరాలను డిజిటలైజేషన్ చేశారు. ప్రస్తుతం బూత్ స్థాయి అధికారుల (బీఎల్వో) వద్ద మరో ఐదు లక్షల పత్రాలు డిజిటలైజేషన్ కోసం సిద్ధంగా ఉన్నాయి.
మరోవైపు ఇంకా 69 లక్షల మంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదని అధికారులు తెలిపారు. ఎన్నికల రికార్డుల్లో ఈ ఓట్లను 'అన్కలెక్టబుల్' విభాగం కింద చేర్చారు. ఓటర్లు ఇచ్చిన చిరునామాలో నివసించకపోవడం, మరణించడం, వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం లేదా ఒకరికంటే ఎక్కువ చోట్ల ఓటు (డూప్లికేట్) ఉండటం వంటి కారణాల వల్ల వీటిని అన్కలెక్టబుల్గా గుర్తించారు. అయితే అర్హులైన ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా అధికారులు ఎడిట్ ఆప్షన్ కూడా అందుబాటులోకి తెచ్చారు. పొరపాటున ఎవరైనా అన్కలెక్టబుల్ జాబితాలో చేరి ఉంటే…. వెంటనే తమ వివరాలను సరిదిద్దుకునే వెసులుబాటు కల్పించారు.
ఒకవేళ ఎస్ఐఆర్-2002 వివరాలు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫారంలోని మిగతా సమాచారాన్ని నింపి బీఎల్వోలకు అందజేయవచ్చు. ఒకవేళ ఆ తర్వాత ఏవైనా నోటీసులు వస్తే… ఏదైనా అధికారిక గుర్తింపు కార్డును చూపించి ఓటు హక్కును సురక్షితంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
ఈనెల 17న ముసాయిదా జాబితా
ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించి డిజిటలైజేషన్ పూర్తయిన ఓటర్ల వివరాలతో ఈ నెల 17న అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. నిర్ణీత సమయంలోగా డిజిటలైజేషన్ కాని ఓటర్ల వివరాలు ఈ ముసాయిదా జాబితాలో ఉండవు.
{{/usCountry}}ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించి డిజిటలైజేషన్ పూర్తయిన ఓటర్ల వివరాలతో ఈ నెల 17న అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. నిర్ణీత సమయంలోగా డిజిటలైజేషన్ కాని ఓటర్ల వివరాలు ఈ ముసాయిదా జాబితాలో ఉండవు.
{{/usCountry}}మరోవైపు వివరాలపై సందేహాలు ఉన్న ఓటర్లకు ఆగస్టు 17 నుంచి అక్టోబరు 15 వరకు నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు అందుకున్న వారు సంబంధిత ఈఆర్వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) ముందు నేరుగా హాజరై, కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను సరిగ్గా పూర్తి చేసిన వారి పేర్లను మాత్రమే అక్టోబరు 19న విడుదల చేసే ఓటర్ల తుది జాబితాలో చేర్చుతారు.
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను జూన్ 25న చేపట్టగా…. తొలి గడువు జూలై 24గా నిర్ణయించారు. ఆ గడువును ఆగస్టు 3కి… ఆ తర్వాత ఆగస్టు 10కి సవరించారు. అంటే ఇవాళ్టితో సర్ ప్రాసెస్ ముగుస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించకపోతే… వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది.