రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. అన్ని ప్రధాన పార్టీల్లోనూ రెబల్స్ సమస్య కనిపించింది. అతికష్టమ్మీద చాలామందిని ఉపసంహరించుకునేలా చేసినప్పటికీ…. కొంత మంది మాత్రం వెనక్కి తగ్గకుండానే బరిలో నిలిచారు. పలుచోట్ల నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మంగళవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణల గడువు పూర్తికాగా… 2,996 వార్డులకుగానూ 12,993 మంది పోటీలో నిలిచారు. 6,701 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో 2,996 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. చాలాచోట్ల రసవత్తరమైన పోటీ కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు… కుర్చీని కైవసం చేసుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇక హోరెత్తనున్న ప్రచారం…
నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా పూర్తి కావటంతో పోటీలో నిలిచే అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చింది. దీంతో అన్ని పార్టీలు కూడా ప్రచారంపై ఫోకస్ పెట్టనున్నాయి. గెలుపే లక్ష్యంగా అడుగులు వేయనున్నాయి. ప్రధాన పార్టీలు ప్రతి వార్డును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో పర్యటన చేయనున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. డిసెంబర్ 5వ తేదీన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బహిరంగ సభ ఉంటుంది. డిసెంబర్ 6వ తేదీన నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. డిసెంబర్ 9మెదక్ జిల్లా పర్యటనతో సీఎం రేవంత్ ప్రచారం ముగుస్తుంది. మరోవైపు మంత్రులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. మెజార్టీ స్థానాల్లో గెలిచి… పీఠాలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ మిశ్రా తొలిసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇవాళ మహబూబ్నగర్ ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, పరిసర ప్రాంతాల కార్యకర్తల సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది.
{{/usCountry}}బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ మిశ్రా తొలిసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇవాళ మహబూబ్నగర్ ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, పరిసర ప్రాంతాల కార్యకర్తల సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది.
{{/usCountry}}మరోవైపు బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్న చోట్ల ఇంఛార్జులను కూడా నియమించింది. మెజార్టీ స్థానాల్లో పాగా వేసి…సత్తా చాటాలని భావిస్తోంది. కేటీఆర్, హరీశ్ రావు పలుచోట్ల ప్రచారం చేయనున్నారు. ఇక ఈసారి జనసేన కూడా పోటీలో నిలిచింది. ఆ పార్టీ అధినేత పవణ్ కల్యాణ్ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగనున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.