కొండగట్టు అభివృద్ధికి TTD నిధులు - భారీ మండపం, సత్రాల నిర్మాణం..! ముఖ్యమైన 7 విషయాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ రూపురేఖలు మారనున్నాయి. టీటీడీ సహకారంతో ఆలయంలో భారీ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ(జనవరి 3) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పలు పనులకు శంకుస్థాపన చేశారు.
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టు ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఆలయ అభివృద్ధి పనుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు రానున్నాయి. రూ.35.19 కోట్లు మంజూరుకు టీటీడీ ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కొండగట్టులో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
కొండగట్టు ఆలయం
కొండగట్టులో అభివృద్ధి పనులు - ముఖ్యమైన 7 అంశాలు:
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సహకారంతో కొండగట్టు ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు. జనవరి 3, 2026వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ పనులకు శంకుస్థాపన చేశారు.
కొండగట్టులో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని… టీటీడీ నిధులతో ఇక్కడ సత్రాలు, సువిశాలమైన దీక్షామండపం నిర్మిస్తారు.
ఈ ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం పవన్… సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత టీటీడీ నుంచి నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది.
కొండగట్టులో అభివృద్ధి పనుల కోసం టీటీడీ నుంచి రూ.35.19 కోట్లు మంజూరయ్యాయి.
టీటీడీ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా కొండగట్టులో మండపం నిర్మిస్తారు.
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో… కొండగట్టు అభివృద్ధికి ఆయన చొరవ తీసుకున్నారు.