ప్రతి మండలానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు - ఈనెల 19న లైసెన్సుల పంపిణీ

రాష్ట్ర భూపారిపాలన వ్యవస్థలో మరో ముందడుగు పడనుంది. ఈనెల 19వ తేదీన సర్వేయ్లకు లైసెన్స్ లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు. సీఎం చేతుల మీదుగా వీటిని అందజేయనున్నారు. 

Published on: Oct 17, 2025, 16:18:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో భూముల‌కు సంబంధించిన అనేక పంచాయితీల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపే ల‌క్ష్యంతో ప్రభుత్వం మరో మార్పునకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా ఇప్ప‌టికే గ్రామ‌ పాల‌నాధికారులు ( జీపీవో)ను అందుబాటులోకి తీసుకురాగా… తాజాగా క్షేత్ర‌స్ధాయిలో ప్రజలకు సులభంగా భూ సేవలు అందేలా ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వీరంతా విధుల్లోకి రాబోతున్నారు.

ప్రతి మండలానికి  లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు
ప్రతి మండలానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

సీఎం చేతుల మీదుగా పంపిణీ…

లైసెన్స్ సర్వేయర్లకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల 19వ తేదీన శిల్ప క‌ళావేదిక‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిక్ష‌ణ పొందిన లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌కు లైసెన్స్‌లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకు వచ్చిన భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్ ను జ‌త ప‌ర‌చ‌డం తప్పనిసరి చేసిన నేప‌ధ్యంలో స‌ర్వే విభాగం పాత్ర మ‌రింత క్రియాశీలం కానుంది. భూభార‌తి చ‌ట్టంలో పేర్కొన్న‌ విధంగా ప్ర‌భుత్వ ల‌క్ష్యం నెర‌వేరాలంటే ప్ర‌స్తుతం ఉన్న 350 మంది స‌ర్వేయ‌ర్లు స‌రిపోయే పరిస్థితి లేదు. మ‌రికొంత మంది స‌ర్వేయ‌ర్లు అవ‌స‌ర‌మ‌వుతార‌ని ప్రభుత్వం భావించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఒక వైపు లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను తీసుకోవ‌డం, మ‌రోవైపు స‌ర్వే విభాగంలో ఖాళీగా ఉన్న స‌ర్వేయ‌ర్ పోస్టులు భ‌ర్తీచేయ‌డం ప్రారంభించింది.

శుక్ర‌వారం నాడు స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో రెవెన్యూశాఖ కార్య‌ద‌ర్శి డిఎస్ లోకేష్‌కుమార్‌, స‌ర్వే విభాగం క‌మిష‌న‌ర్ రాజీవ్ గాంధీ హ‌నుమంత్ తో క‌లిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రిగారు మాట్లాడారు. ఈ పోస్టులకు ప‌ది వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా తొలివిడ‌త‌లో ఏడు వేల మందికి శిక్ష‌ణ ఇచ్చామ‌ని ఇందులో 3465 మంది అర్హ‌త సాధించార‌ని తెలిపారు.

భూ విస్తీర్ణాన్ని బ‌ట్టి ప్ర‌తి మండ‌లానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను నియ‌మిస్తామ‌ని తెలిపారు. రెండ‌వ విడ‌త‌లో మ‌రో మూడు వేల మందికి ఆగ‌స్టు 18వ తేదీ నుంచి శిక్ష‌ణను ప్రారంభించామ‌ని ఈనెల 26వ తేదీన జేఎన్‌టీయూ ఆధ్వ‌ర్యంలో అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన వారికి 40 రోజుల పాటు అప్రంటిస్ శిక్ష‌ణ ఉంటుంద‌ని వీరి సేవ‌లు కూడా డిసెంబ‌ర్ రెండ‌వ వారం నాటికి అందుబాటులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.

రెవెన్యూ శాఖకు సర్వే విభాగానికి అవినాభావ సంబంధం ఉంటుంద‌ని మంత్రి పొంగులేటి చెప్పారు. భూముల కొలతలు, రికార్డులు స్పష్టంగా ఉన్న‌ప్పుడే వివాదాలు తగ్గుతాయ‌ని సర్వే వ్యవస్థ బలపడితేనే ప్రజలకు భద్రత, న్యాయం లభిస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా సర్వే విభాగం నిర్లక్ష్యానికి గురైందని, క్షేత్ర‌స్దాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలకు తగిన సేవలు అందలేదని గుర్తుచేశారు.

ప్రతి రెవెన్యూ గ్రామంలో జీపీవోలు, ఇప్పుడు ప్రతి మండలంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లు - ఈ రెండు చర్యలతో ప్రజలకు అవసరమైన భూ సంబంధిత సేవలు అందేలా వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భూమి రికార్డులు స్పష్టంగా ఉండేలా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, అవినీతి లేని సేవలు అందించడమే త‌మ ప్ర‌భుత్వ సంక‌ల్ప‌మ‌ని చెప్పారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More