తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, ఎల్ నినో(El Nino) ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతంలో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ రైతులను హెచ్చరించింది. రుతుపవనాల ఆరంభంలో కురిసే మొదటి వర్షానికే రైతులు తొందరపడి విత్తనాలు నాటవద్దని అధికారులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ ఏడాది సాగు ప్రణాళికలపై వ్యవసాయ కమిషనర్ డాక్టర్ బి. గోపి మాట్లాడారు. 'కనీసం 50 నుండి 70 మి.మీ వర్షపాతం నమోదై, భూమిలో విత్తనం మొలకెత్తడానికి సరిపడా తేమ ఉందని నమ్మకం కుదిరిన తర్వాతే రైతులు విత్తనాలు వేయాలి. ప్రస్తుత అంచనాల ప్రకారం, రాబోయే వారంలో వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయి. కాబట్టి రైతులు సాగు విషయంలో కాస్త ఓపిక పట్టాలి.' అని సూచించారు.
తెలంగాణలోని మొత్తం సాగు భూమిలో చాలా వరకు కేవలం వర్షధార పంటలపైనే ఆధారపడి ఉంది. ఈ భారీ విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని, వర్షాలు ఆలస్యమవడం లేదా మధ్యలో ముఖం చాటేయడం వంటి పరిస్థితులను తట్టుకునేలా వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసింది. రైతులు ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబించాలని, వీలైనంత వరకు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని కమిషనర్ గోపి కోరారు. వర్షాల రాకను బట్టి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
మరోవైపు, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రైతులు అప్పుడే వ్యవసాయ పనులను ప్రారంభించారు. వ్యవసాయ శాఖకు చెందిన ఫెర్టిలైజర్ యాప్ ద్వారా శుక్రవారం నాటికి దాదాపు 3 లక్షల మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ లోని కొన్ని ప్రాంతాల్లో యూరియాకు మంచి డిమాండ్ కనిపిస్తోందని, దీన్ని బట్టి అక్కడ సాగు పనులు మొదలైనట్లు గుర్తిస్తున్నామని డాక్టర్ గోపి తెలిపారు.
తెలంగాణలో ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 130 లక్షల ఎకరాలు కాగా, అందులో సగానికి పైగా వర్షధారితమే. అయితే ఈసారి కృష్ణా, గోదావరి నదుల ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక క్యాచ్మెంట్ ఏరియాలలో (నదీ పరివాహక ప్రాంతాలు) వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నదుల్లోకి వచ్చే ఇన్ఫ్లో (వరద నీరు) మన రాష్ట్ర సాగునీటి లభ్యతను శాసిస్తుంది. కాబట్టి, ఎగువ రాష్ట్రాల్లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు వ్యవసాయ కమిషనర్ స్పష్టం చేశారు.
{{/usCountry}}తెలంగాణలో ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 130 లక్షల ఎకరాలు కాగా, అందులో సగానికి పైగా వర్షధారితమే. అయితే ఈసారి కృష్ణా, గోదావరి నదుల ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక క్యాచ్మెంట్ ఏరియాలలో (నదీ పరివాహక ప్రాంతాలు) వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నదుల్లోకి వచ్చే ఇన్ఫ్లో (వరద నీరు) మన రాష్ట్ర సాగునీటి లభ్యతను శాసిస్తుంది. కాబట్టి, ఎగువ రాష్ట్రాల్లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు వ్యవసాయ కమిషనర్ స్పష్టం చేశారు.
{{/usCountry}}