రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలు రైతుల చెంతకు చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్కు మంత్రి శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యాన రంగానికి కొత్త దిశను చూపే చారిత్రాత్మక ఘట్టంగా ఈ పరిశోధనా సముదాయం నిలుస్తుందని అన్నారు.

ఇప్పటివరకు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, ప్రయోగశాలల్లో ఎన్నో విలువైన పరిశోధనలు జరిగినప్పటికీ వాటి ఫలితాలు రైతులకు ఆశించిన స్థాయిలో చేరడం లేదని మంత్రి అన్నారు. గతంలో పరిశోధన ఫలితాలను రైతులకు చేరవేయడానికి రేడియో, టెలివిజన్ వంటి పరిమిత మార్గాలు ఉండేవని, ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి శక్తివంతమైన మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పరిశోధనల ఫలితాలను వీడియోలు, షార్ట్ ఫిల్మ్లు, సోషల్ మీడియా ద్వారా రైతులకు చేరేలా శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, ఉద్యాన శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాష్ట్ర వ్యవసాయ భూమిలో ఉద్యాన పంటలు సుమారు 6 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, వ్యవసాయ స్థూల విలువలో వాటి వాటా 26 శాతం, సుమారు రూ.30,346 కోట్లుగా ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. ఉద్యాన రంగం రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నందున పరిశోధన, సాంకేతికత, విస్తరణ సేవలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిలో సుమారు 70 శాతం లోటు ఉందని, ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండటం ఆందోళనకరమని మంత్రి అన్నారు. రాష్ట్రంలోనే డిమాండ్ ఉన్న కూరగాయలు, ఉద్యాన పంటలను పండించేలా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో డెమాన్స్ట్రేషన్ ప్లాట్లను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు ప్రత్యక్షంగా పంటలను, దిగుబడులను, ఆదాయ అవకాశాలను చూసి నేర్చుకునేలా ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్లు నిర్వహిస్తే ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
చిన్న, సన్నకారు రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరగాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది రైతుల్లో దాదాపు 90 శాతం మంది చిన్న రైతులేనని, రెండు మూడు ఎకరాల భూమి కలిగిన రైతులు ఖరీదైన యంత్రాలు లేదా భారీ పెట్టుబడులతో కూడిన సాంకేతికతను స్వయంగా స్వీకరించలేరని అన్నారు. అందువల్ల తక్కువ ఖర్చుతో, చిన్న కమతాల్లో అమలు చేయగల సాంకేతికత, యంత్రాలు, సాగు పద్ధతులపై పరిశోధనలు జరగాలని మంత్రి సూచించారు.
{{/usCountry}}చిన్న, సన్నకారు రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరగాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది రైతుల్లో దాదాపు 90 శాతం మంది చిన్న రైతులేనని, రెండు మూడు ఎకరాల భూమి కలిగిన రైతులు ఖరీదైన యంత్రాలు లేదా భారీ పెట్టుబడులతో కూడిన సాంకేతికతను స్వయంగా స్వీకరించలేరని అన్నారు. అందువల్ల తక్కువ ఖర్చుతో, చిన్న కమతాల్లో అమలు చేయగల సాంకేతికత, యంత్రాలు, సాగు పద్ధతులపై పరిశోధనలు జరగాలని మంత్రి సూచించారు.
{{/usCountry}}తెలంగాణ ఇప్పటికే ఆయిల్పామ్ సాగు విస్తరణలో దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రానున్న మూడు నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆయిల్పామ్ విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆయిల్పామ్తో పాటు కోకో, జాపత్రి తదితర అంతర పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. రైతులు ప్రత్యక్షంగా చూసి నేర్చుకునేలా ఈ పద్ధతులను పరిశోధనా కేంద్రాలు, డెమాన్స్ట్రేషన్ ఫారాల్లో ప్రదర్శించాలని సూచించారు.
రైతులు అధికంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా శాస్త్రీయ సూచనల మేరకు సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించేలా పరిశోధనా సంస్థలు, వ్యవసాయ శాఖ అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. పంటల్లో రసాయన అవశేషాలను తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులను అందించగలిగితే దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా తెలంగాణ పంటలకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని అన్నారు.