Feel The Jail : ఒక్క రోజు చంచల్గూడ జైలులో ఉండాలనుకుంటున్నారా? ఫీజు ఎంతంటే?
Feel The Jail : తెలంగాణ ప్రభుత్వం చంచల్గూడ జైలు మ్యూజియంలో ఒక ప్రత్యేక జైలు అనుభవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో సందర్శకులు నిజమైన జైలు దినచర్యలు, నిబంధనలను పాటిస్తూ 24 గంటల పాటు ఖైదీలుగా గడపవచ్చు. అదే ఫీల్ ది జైల్.
హైదరాబాద్లోని చంచల్గూడ జైలు ప్రాంగణంలో 'ఫీల్ ది జైల్' అనే ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం కింద ప్రజలు ఒక రోజంతా జైలు జీవితాన్ని అనుభవించవచ్చు. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చంచల్గూడలో ఏర్పాటు చేసిన కొత్త జైలు మ్యూజియం, ఇంటరాక్టివ్ ప్రిజన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను అధికారికంగా ప్రారంభించారు. జైలు జీవితం, పరివర్తన గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.

కాలక్రమేణా పాత భవనం దెబ్బతినడంతో మ్యూజియంను సంగారెడ్డి నుంచి తరలించారు. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా పర్యవేక్షణలో కొత్త కేంద్రాన్ని ఆధునిక సౌకర్యాలు, అధునాతన ప్రదర్శనలతో పునఃరూపకల్పన చేశారు. ఇది ఇప్పుడు దేశంలో ఐదో జైలు మ్యూజియంగా గుర్తింపు పొందిందని అధికారులు తెలిపారు.
'ఫీల్ ది జైల్' కార్యక్రమం కింద పాల్గొనేవారు జైలు వాతావరణంలో 24 గంటలు గడపడానికి రూ. 500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత సందర్శకులను ఖైదీలలాగే చూస్తారు. సాధారణ ఖైదీలకు ఇచ్చే విధంగానే వారికి జైలు యూనిఫాంలు, స్టీల్ ప్లేట్లు, మగ్గులు, గుర్తింపు సంఖ్యను అందిస్తారు.
పాల్గొనేవారు తమ బస అంతటా జైలు నియమాలను కచ్చితంగా పాటించాలి. జైలు సమయాల ప్రకారం నిద్రలేవడం, జైలు లోపల తయారుచేసిన ఆహారాన్ని తినడం, పగటిపూట కేటాయించిన పనులను చేయడం దినచర్యలో భాగంగా ఉంటాయి. అయితే ఫీల్ ది జైల్లో పాల్గొనాలని వచ్చి.. 24 గంటలు పూర్తి చేయకముందే కార్యక్రమం నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఎవరైనా రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఇక కొత్తగా ప్రారంభించిన మ్యూజియంలో పాత శిక్షా పద్ధతులు, సంకెళ్లు, చేతి సంకెళ్లు, పూర్వ కాలంలో ఉపయోగించిన చారిత్రక జైలు పరికరాలను కూడా ప్రదర్శిస్తారు. ఖైదీలతో సంభాషణలు, సందర్శకుల సమావేశాలతో సహా జైలు పరిపాలన ఎలా పనిచేస్తుందో ఆడియో విజువల్ వివరిస్తాయి.
జైలు శాఖ అధికారుల ప్రకారం, ఈ కార్యక్రమం ప్రధానంగా యువతలో అవగాహన కల్పించడం, చిన్న పొరపాట్లు జీవితంలో ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో ప్రజలకు అర్థమయ్యేలా సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. జైలు చరిత్రను, ఆధునిక సంస్కరణలను ఒకే చోట మిళితం చేసేలా ఈ మ్యూజియంను రూపొందించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


