ఈ ఆగస్టు నెలలో గల్ఫ్ దేశాల(UAE) నుండి భారతదేశానికి ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు విమాన చార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. అక్కడ వేసవి సెలవుల డిమాండ్ కారణంగా యూఏఈ ప్రయాణికులకు భారతదేశంలోనే అత్యంత ఖరీదైన గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచింది. ఇక్కడికి రిటర్న్ ఎయిర్ఫేర్ (రానుపోను టికెట్ ధర) ఏకంగా 9,000 దిర్హామ్లు (భారత కరెన్సీలో రూ. 2,31,000 పైమాటే) దాటేసింది. ముంబై విమాన టికెట్ ధరలతో పోలిస్తే హైదరాబాద్ ఛార్జీలు దాదాపు 6 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆగస్టు 1 నుండి 31 మధ్య ప్రయాణాల కోసం ఎమిరేట్స్, ఇండిగో, స్పైస్జెట్ వంటి ప్రధాన ఎయిర్లైన్స్లో టికెట్ ధరలను విశ్లేషించగా ఎక్కువగా ఉన్నాయి.
హైదరాబాద్లో అత్యధికంగా 9,250 దిర్హామ్లు (రూ. 2,37,667) రానుపోను విమాన ఛార్జీ నమోదైనట్లు గుర్తించారు. ఢిల్లీ 9,090 దిర్హామ్లు (రూ. 2,33,556) రానుపోను ఛార్జీలతో రెండో స్థానంలో నిలవగా, కొచ్చి 7,800(రూ.2,00,411)తో దాని తర్వాతి స్థానంలో ఉంది. మరోవైపు ముంబైకి రానుపోను టిక్కెట్లు 1,404 దిర్హామ్లు (రూ. 35,971) నుండి ప్రారంభం కాగా, చెన్నైకి ఛార్జీలు 1,678 దిర్హామ్లు(రూ. 43,114) నుండి అందుబాటులో ఉన్నాయి.
యూఏఈలో పాఠశాలలకు వేసవి సెలవులు కావడం, పండగల సీజన్ డిమాండ్, కొన్ని ప్రముఖ రూట్లలో పరిమిత సీట్ల లభ్యత కారణంగానే ఈ ధరల పెరుగుదల ఉందని ట్రావెల్ కంపెనీలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశానికి వెళ్లే విమానాలకు విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొంటున్నాయి. ప్రయాణ తేదీకి కొన్ని వారాల ముందే చాలా ఫ్లైట్స్ ఫుల్ అయిపోయాయని అంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవడానికి కొందరు ప్రయాణికులు దుబాయ్ నుండి ముంబై వచ్చి, అక్కడి నుండి డొమెస్టిక్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా కేరళ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
రద్దీ దృష్ట్యా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కోరింది. విమానం బయలుదేరే సమయానికి కనీసం 3 గంటల ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలి. బోర్డింగ్ గేట్ల వద్దకు 60 నిమిషాల ముందే వెళ్లాలి. రద్దీని తట్టుకోవడానికి ఎమిరేట్స్ యాప్, ఆన్లైన్ చెక్-ఇన్ లేదా సిటీ చెక్-ఇన్ సెంటర్లను ఉపయోగించుకోవాలి.
{{/usCountry}}రద్దీ దృష్ట్యా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కోరింది. విమానం బయలుదేరే సమయానికి కనీసం 3 గంటల ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలి. బోర్డింగ్ గేట్ల వద్దకు 60 నిమిషాల ముందే వెళ్లాలి. రద్దీని తట్టుకోవడానికి ఎమిరేట్స్ యాప్, ఆన్లైన్ చెక్-ఇన్ లేదా సిటీ చెక్-ఇన్ సెంటర్లను ఉపయోగించుకోవాలి.
{{/usCountry}}విమాన సమాచారం కోసం 'మేనేజ్ యువర్ బుకింగ్' సర్వీస్ ద్వారా కాంటాక్ట్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. వ్యాపారాలు, పర్యాటకం, ప్రవాస భారతీయుల రాకపోకలతో యూఏఈ-ఇండియా ఫ్లైట్ రూట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమాన మార్గాలలో ఒకటిగా కొనసాగుతోంది.