ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటి ప్రవాహంతో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది. శుక్రవారం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 45.9 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఫ్లడ్ మాన్యువల్ నిబంధనల ప్రకారం అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్తగూడెంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చారు.
వరద పరిస్థితులు, సహాయం కోసం ప్రజలు అధికారులను సంప్రదించేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించారు. కంట్రోల్ రూమ్ నంబర్: 08744241950, వాట్సాప్ నంబర్: 9392919743 అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో, గోదావరి పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, నదిలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ధవళేశ్వరం వద్ద భారీగా వరద నీరు
ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ అండ్ ఔట్ ఫ్లో 2,36,870 క్యూసెక్కులుగా ఉంది.ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఆగస్టు 1 ఉదయానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయవచ్చు. గోదావరి పరీవాహక జిల్లాల్లో పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అన్నారు. లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
నదిలో స్నానం, చేపలు పట్టడంలాంటివి చేయరాదని హెచ్చరించారు. వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పరిస్థితి
{{/usCountry}}నదిలో స్నానం, చేపలు పట్టడంలాంటివి చేయరాదని హెచ్చరించారు. వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పరిస్థితి
{{/usCountry}}మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 147.41 మీటర్లకు చేరుకుంది. శుక్రవారం ఉదయం 11.48 గంటల సమయానికి ప్రాజెక్ట్లోకి 1.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అధికారులు ప్రాజెక్ట్ 62 గేట్లలో 15 గేట్లను ఎత్తి దిగువకు 1.08 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నది ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోత
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి నది జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. 5 భారీ పంపుసెట్లతో సుమారు 16వేల క్యూసెక్కుల నీటిని మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ఎగువన భారీ వర్షాల కారణంగా నీటి నిల్వ పెరగడంతో దిగువ ప్రాంతం నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు చేస్తున్నారు.