హైదరాబాద్లోని కంటోన్మెంట్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ నుండి 12 ఆయుధాలు చోరీకి గురైనట్లు సైనిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయుధాలను భద్రపరిచిన గది తాళాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి వాటిని తీసుకువెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

సైనిక అధికారులు మల్కాజిగిరిలోని బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఇది ఒక రక్షణ సంస్థకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఆయుధాల చోరీలో అంతర్గత వ్యక్తుల పాత్రపై సైనికాధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ దళాల శిక్షణా సంస్థకు అనుబంధంగా అనేక రెజిమెంట్లు పనిచేస్తున్నాయి. మద్రాస్ రెజిమెంట్ వాటిలో ఒకటి, సైనిక సిబ్బంది ఆయుధాలను నిల్వ చేసే ఒక విభాగం ఇక్కడ ఉంది. ఇది చాలా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటుంది.
ఈ విభాగంలోకి ఎవరికి పడితే వారికి ప్రవేశం ఉండదు. సంబంధిత వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆదివారం రాత్రి సైనిక అధికారులు ఈ చోరీని గుర్తించినట్టుగా తెలుస్తోంది. గల్లంతైన ఆయుధాల్లో నాలుగు ఏకే-47, ఆరు పిస్టళ్లు, ఒక (ఇన్సాస్) రైఫిల్, మందుగుండు సామగ్రిగా గుర్తించారు. మెుత్తం 12 ఆయుధాలను ఎత్తుకెళ్లినట్టుగా గుర్తించారు. సీనియర్ ఆర్మీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆ ప్రాంతంలోకి బయటివారికి ప్రవేశం లేనందున సిబ్బందిలో ఒకరి ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
మద్రాస్ రెజిమెంట్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో ఆర్మీ అధికారులు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్కు చెందిన సీనియర్ అధికారులు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఘటనలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మద్రాస్ రెజిమెంట్ ప్రాంగణానికి నాలుగు గేట్లు ఉన్నాయి. ఆర్మీ అధికారులు, సైనికులు, అథరైజ్డ్ వ్యక్తులు తప్ప ఇతరులు ప్రాంగణంలోకి ప్రవేశించలేరు. ఇలాంటి నిషేధిత ప్రాంతం నుంచి ఆయుధాల దొంగతనం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆయుధాల బరువు కారణంగా వాటిని ఒక్కరే మోసుకెళ్లి ఉండరని పోలీసులు అనుమానిస్తున్నారు.
కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రమేయం ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అనుమానితులు ఆయుధాల నిల్వ గదికి చేరుకోగలిగారు కాబట్టి, వారికి ఆ ప్రాంగణం గురించి ముందే తెలిసి ఉండే అవకాశం ఉందని కూడా వారు భావిస్తున్నారు. సీనియర్ పోలీస్ అధికారులు మద్రాస్ రెజిమెంట్ ప్రాంగణానికి చేరుకుని, సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సమాచారం సేకరించేందుకు ఆర్మీ అధికారులు సిబ్బందిలో అంతర్గత విచారణ కూడా జరుపుతున్నారని సమాచారం.
{{/usCountry}}కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రమేయం ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అనుమానితులు ఆయుధాల నిల్వ గదికి చేరుకోగలిగారు కాబట్టి, వారికి ఆ ప్రాంగణం గురించి ముందే తెలిసి ఉండే అవకాశం ఉందని కూడా వారు భావిస్తున్నారు. సీనియర్ పోలీస్ అధికారులు మద్రాస్ రెజిమెంట్ ప్రాంగణానికి చేరుకుని, సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సమాచారం సేకరించేందుకు ఆర్మీ అధికారులు సిబ్బందిలో అంతర్గత విచారణ కూడా జరుపుతున్నారని సమాచారం.
{{/usCountry}}