GHMC Summer Coaching : జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ స్టార్ట్.. ఎలా రిజిస్ట్రర్ చేసుకోవాలి?
Summer Camps : వేసవి సెలవులు వచ్చేశాయి. హైదరాబాద్ పరిధిలోని పిల్లలను వేసవి శిక్షణా శిబిరాలకు పంపవచ్చు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వార్షిక వేసవి శిక్షణా శిబిరాలు శనివారం ప్రారంభమయ్యాయి. మే 31 వరకు కొనసాగుతాయి. ఆరు నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల కోసం 44 క్రీడాంశాలపై ఈ శిబిరాలను ఉదయం 6 నుంచి 8 గంటల వరకు 752 కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. పిల్లలు నామమాత్రపు సభ్యత్వ రుసుము చెల్లించి జీహెచ్ఎంసీ పోర్టల్ sports.ghmc.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చు . పార్ట్-టైమ్, గౌరవ కోచ్ల సేవలను వినియోగించుకుంటున్నారు.

అందించే క్రీడలలో క్రికెట్, ఆర్చరీ, బాస్కెట్బాల్, ఫుట్బాల్, టెన్నిస్, నెట్బాల్, రోలర్ స్కేటింగ్, త్రోబాల్, సైక్లింగ్, స్విమ్మింగ్తో పాటు రెజ్లింగ్, తైక్వాండో, వుషు, బాక్సింగ్, కిక్బాక్సింగ్, జూడో, ముయ్ థాయ్, కరాటే ఉన్నాయి. శిబిరంలో భాగంగా జీహెచ్ఎంసీ మే 5 నుండి 11 వరకు జోన్ల వారీగా స్పోర్ట్స్ క్విజ్లను, మే 18 నుండి 23 వరకు 16 క్రీడలలో టోర్నమెంట్లను నిర్వహిస్తుంది.
ఈ లింక్ క్లిక్ చేసిన రిజిస్ట్రర్ చేసుకోండి
పెట్ అడప్షన్ డ్రైవ్
జీహెచ్ఎంసీ, రాజేంద్రనగర్లోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ సహకారంతో, దేశీయ కుక్కపిల్లలపై దృష్టి సారిస్తూ వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్లో పెంపుడు జంతువుల దత్తత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆరు కుక్కపిల్లలను దత్తత తీసుకున్నారు. అధికారిక పత్రాలు, భవిష్యత్ ఆరోగ్య పర్యవేక్షణ కోసం 33 పెంపుడు జంతువులను అక్కడికక్కడే నమోదు చేశారు. 81 యాంటీ-రాబిస్ టీకాలు వేశారు. వరల్డ్ వెటర్నరీ డే పురస్కరించుకుని, పశు ఆరోగ్యం, జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల నియంత్రణ, సమాజ సంక్షేమంలో పశువైద్యుల పాత్రను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యాన్ని ప్రోత్సహించడం, దత్తత ద్వారా వీధి కుక్కల పునరావాసానికి మద్దతు ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నగరంలో రేబీస్ నివారణ చర్యలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


