...
...
Next Story

గోదావరి జలాల‌ను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి జలాల‌ను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంప‌ల్లితో పాటు దేవాదుల‌, సీతారామ ప్రాజెక్టుల‌ నుంచి సాధ్యమైనంత మేర‌కు ఎత్తిపోత‌లు చేప‌ట్టాల‌న్నారు.

Published on: Aug 12, 2026, 22:02:05 IST
Advertisement

మంత్రి ఉత్తమ్‌తోపాటు ఉన్నతాధికారులతో నీటి పారుద‌ల శాఖ‌పై ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో ముఖ్యమంత్రి మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. దేవాదుల నుంచి గ‌తంలో ఎన్నడూ లేని విధంగా 9 పంపుల‌తో ఎత్తిపోత‌లు చేప‌ట్టామ‌ని సమావేశంలో మంత్రి ఉత్తమ్ వివరించారు. దేవాదుల‌, సీతారామ‌ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోత‌ల‌కు సంబంధించి ఏవైనా చిన్న చిన్న స‌మ‌స్యలుంటే అధికారులు వాటి ప‌రిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారించాల‌ని ముఖ్యమంత్రి సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

ప‌లు ప్రాజెక్టుల కింద ఒక‌ట్రెండు గ్రామాలు, కొద్దిపాటి వ్యవ‌సాయ భూముల‌కు ప‌రిహారం చెల్లింపు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, వాటిని వెంట‌నే చెల్లించేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు. నీటి పారుద‌ల‌, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ప‌ర్యటించి ముంపు గ్రామాలు, ప‌రిహారం, పున‌రావాసానికి సంబంధించి వాస్తవ నివేదిక రూపొందించాల‌ని ఆదేశించారు.

త‌క్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంట‌నే ప‌రిహారం చెల్లించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అధికారులు ఆ ప‌నుల‌ను పూర్తి చేస్తే బ‌స్వాపూర్‌, గౌర‌వెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. గ‌ట్టు, గూడెందొడ్డి ఎత్తిపోత‌ల సామ‌ర్థ్యం పెంపున‌కు సంబంధించి స‌మ‌గ్ర అధ్యయ‌నం చేయాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌ను ఆదేశించారు. గూడెందొడ్డి పంప్డ్‌స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి క‌న్సల్టెంట్ నియ‌మించాల‌ని ఆదేశించారు.

జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచ‌న‌ల మేర‌కే సుందిళ్ల, అన్నారం, మేడిగ‌డ్డ బ్యారేజీల్లో నీరు నిల్వ చేయ‌డం లేద‌ని, ఈ విష‌యంలో ఎన్డీఎస్ఏ సూచ‌న‌లు పాటించాల‌న్నారు. మేడిగ‌డ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ అనేక లోపాలు ఉన్నట్లు తేలింద‌ని మంత్రి తెలిపారు. ఈ విష‌యంలో ఎన్డీఎస్ఏతో సంప్రదించాల‌ని ముఖ్యమంత్రి గారు సూచించారు.

ఇప్పటికే బ‌కాయిల వ‌సూలులో కొంత పురోగ‌తి ఉంద‌ని, అయితే ప్రతి ధాన్యం గింజ‌కు సంబంధించి బ‌కాయిని వ‌సూలు చేయాల్సిందేన‌ని స్పష్టం చేశారు. బ‌కాయిల వ‌సూలుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

విధివిధానాల రూప‌క‌ల్పన పూర్తయిన త‌ర్వాత ఆ నివేదిక‌ను మంత్రివ‌ర్గ ఉప సంఘానికి స‌మ‌ర్పించాల‌ని సూచించారు. మంత్రివ‌ర్గ ఉప సంఘం ప‌రిశీల‌న అనంత‌రం ప్రభుత్వం త‌గు నిర్ణయం తీసుకుంటుంద‌ని తెలిపారు. మొండి బ‌కాయిదారులుగా మారిన మిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని మ‌హిళా సంఘాల‌కు కేటాయించి మిల్లింగ్ బాధ్యత‌ల‌ను మ‌హిళా సంఘాల‌కు అప్పగిస్తామ‌ని చెప్పారు.

ప్రతి సీజ‌న్‌లో ధాన్యం నిల్వకు ఇబ్బందులు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఇప్పటి నుంచే త‌గు కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌కు సూచించారు. ధాన్యం భారీగా వ‌చ్చే న‌ల్గొండ‌, సూర్యాపేట‌, నిజామాబాద్‌, పెద్దప‌ల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్‌ల ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టు కింద చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

స్వయం స‌హాయక‌ సంఘాల ఆధ్వర్యంలో సైలో బ్యాగ్ నిర్మాణాల‌కు నియోజ‌క‌వ‌ర్గానికి 50 నుంచి 100 ఎక‌రాల భూమిని కేటాయిస్తామ‌ని ముఖ్యమంత్రి తెలియ‌జేశారు. వీటి నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ, పౌర‌స‌ర‌ఫ‌రాలు, మ‌హిళా సంక్షేమ శాఖ‌ల మంత్రులతో స‌మావేశం ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. వీబీ జీ రామ్ జీ లో ప్లాట్‌పాంల నిర్మాణానికి అవ‌కాశం ఉన్నందున‌, విశాల‌మైన ప్లాట్‌పాంలు నిర్మించి జ‌ర్మన్ టెంట్లతో ధాన్యం నిల్వకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe