పత్తి కొనుగోళ్లపై సీసీఐ అన్నదాతలకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రైతన్నల దగ్గర నిల్వ ఉన్న, లేట్ క్రాప్ ద్వారా సేకరిస్తున్న పత్తిని కొనుగోళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇప్పటికే సీసీఐ కేంద్రాలు మూతపడాల్సి ఉండగా.. రైతుల కోసం పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ఈ నెలాఖరు వరకు పత్తి సేకరణను కొనసాగించాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిర్ణయించింది.

వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకారం సీసీఐ ఇప్పటివరకు 8.8 లక్షలకు పైగా రైతుల నుండి రూ.12,823 కోట్ల విలువైన 16.15 లక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో పత్తి ఇంకా తీస్తున్నందున సేకరణ తేదీని పొడిగించాలని కోరుతూ కేంద్ర జౌళి మంత్రి, సీసీఐ, రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్కు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు.
పత్తి అమ్మకానికి పొడిగించిన గడువును ఉపయోగించుకోవాలని, నాణ్యత నిబంధనలను అనుసరించడం ద్వారా క్వింటాలుకు రూ.8,110 కనీస మద్దతు ధరకు సీసీఐకి తమ ఉత్పత్తులను విక్రయించాలని రైతులను తుమ్మల కోరారు. మార్కెట్లో రైతుల నుండి 2.24 లక్షల టన్నుల తక్కువ నాణ్యత గల పత్తిని కూడా కొనుగోలు చేశామని, మరో 9.99 లక్షల టన్నుల పత్తి నిల్వలు ఇప్పటికీ రైతుల వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
రైతు సంఘాలు, జిన్నింగ్ మిల్లుల నుండి వివరాలను నమోదు చేయడానికి ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి, యాప్ను ఉపయోగించుకునేలా చేసిందన్నారు మంత్రి తుమ్మల. యాప్లో ఉత్పత్తుల(పత్తి) వివరాలను బుక్ చేసుకోవడం వల్ల రైతులు నిర్ణీత/నిర్దేశిత సమయంలో కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు క్యూలలో పత్తిని ఉంచకుండా ఉండటానికి వీలు కల్పిస్తుందని మంత్రి చెప్పారు.
ఇప్పుడు సీసీఐ సమయం పొడిగించడంతో రైతులు తమ ఉత్పత్తులన్నింటినీ అమ్ముకోవచ్చు. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, 2025-26 ఖరీఫ్ సీజన్లో 50.7 లక్షల ఎకరాల్లో పత్తిని పండించారు, కానీ 45.32 లక్షల ఎకరాల్లో మాత్రమే సురక్షితంగా ఉంది. ఎందుకంటే మిగిలిన విస్తీర్ణంలో పంట భారీ వర్షాలు, వరదలలో తీవ్రంగా దెబ్బతింది. 45.32 లక్షల ఎకరాల్లో పత్తి ఉత్పత్తి 28.29 లక్షల టన్నులుగా అంచనా వేశారు అధికారులు.
{{/usCountry}}ఇప్పుడు సీసీఐ సమయం పొడిగించడంతో రైతులు తమ ఉత్పత్తులన్నింటినీ అమ్ముకోవచ్చు. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, 2025-26 ఖరీఫ్ సీజన్లో 50.7 లక్షల ఎకరాల్లో పత్తిని పండించారు, కానీ 45.32 లక్షల ఎకరాల్లో మాత్రమే సురక్షితంగా ఉంది. ఎందుకంటే మిగిలిన విస్తీర్ణంలో పంట భారీ వర్షాలు, వరదలలో తీవ్రంగా దెబ్బతింది. 45.32 లక్షల ఎకరాల్లో పత్తి ఉత్పత్తి 28.29 లక్షల టన్నులుగా అంచనా వేశారు అధికారులు.
{{/usCountry}}