...
...
Next Story

TG AP Half Day Schools : తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు - ఏపీలో ఎప్పుడంటే..?

తెలంగాణలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు మధ్యాహ్నం వరకు ఉండనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీలో కూడా ఇదే తేదీ నుంచి ఉండనున్నాయి.

Published on: Mar 12, 2026 12:23 PM IST
Advertisement

తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నడవనున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నడుస్తాయి. ప్రైవేట్ బడులు కూడా ఒంటిపూట పనిచేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

ఒంటిపూట బడులు
ఒంటిపూట బడులు

విద్యాశాఖ నిర్ణయం మేరకు ఉదయం 8 గంటలకే బడులు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలు కూడా ఇదే టైమింగ్స్ పాటించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో…. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పదో తరగతి పరీక్షలు జరిగే సెంటర్లలో మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు బడులను నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత… యథావిధిగా ఉదయం 8 నుంచే బడి తెరిచి… మధ్యాహ్నం 12.30 గంటలకు క్లోజ్ చేస్తారు.

ఏపీలో ఎప్పుడంటే..?

మరోవైపు మార్చి 16వ తేదీ నుంచే ఏపీలోని పాఠశాలలకు కూడా ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఏ క్షణమైనా అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఒంటిపూట బడుల సమయంలో ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకూ తరగతులు నిర్వహిస్తారు. 12 గంటల 30 నిమిషాలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నారు.

ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్‌ ఒకటితో ముగుస్తాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పలు ప్రభుత్వ పాఠశాలలను కూడా టెన్త్ ఎగ్జామ్ సెంటర్లుగా ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో మాత్రం… ఒంటిపూట బడుల నిర్వహణ మధ్యాహ్నం నుంచి ఉంటుంది. టెన్త్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత…. మిగతా స్కూళ్లలో మాదిరిగానే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రం బడులు తెరిచి ఉంచుతారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe