'ఆయన ఇప్పుడు ఆ పరమశివుడి పాదాల చెంత, ఆ కైలాసంలోనే ఉండిపోయారు.. ఆయన ఆత్మకు అదే ప్రశాంతతనిస్తుంది..." ఎవరెస్ట్ పర్వాతారోహణ ముగించుకుని, తిరుగుప్రయాణంలో వస్తుండగా కన్నుమూసిన హైదరాబాద్ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ (53) కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు ఇవి. అరుణ్ కుటుంబ సభ్యులు అత్యంత భారమైన హృదయంతో తీసుకున్న నిర్ణయం ఇది. ప్రమాదకరమైన పరిస్థితుల నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని ఎవరెస్ట్ పర్వతంపైనే వదిలివేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.

తెలంగాణకు చెందిన అరుణ్ కుమార్ తివారీ ఒక ఐటీ ప్రొఫెషనల్. పర్వతారోహణపై ఉన్న మక్కువతో గత వారం ఆయన ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అయితే, సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. శిఖరం నుంచి కిందకు దిగుతుండగా 'హిల్లరీ స్టెప్' అనే ప్రమాదకరమైన ప్రాంతంలో ఆయన అస్వస్థతకు గురై మరణించారు.
"ఆయన శివుడి ఆవాసంలోనే ఉన్నారు.."
అరుణ్ కుమార్ తివారీ మరణంపై ఆయన బావ సుధీర్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. కుటుంబం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక ఉన్న మానవీయ, ఆధ్యాత్మిక కోణాన్ని పంచుకున్నారు. "ఎవరెస్ట్ పర్వతాన్ని మేం పరమశివుని నివాసంగా భావిస్తాం. అరుణ్ ఇప్పుడు ఆ దేవుడి చెంతనే ఉన్నారు. అంత ఎత్తు నుండి భౌతికకాయాన్ని కిందకు తీసుకురావాలంటే శరీరం పూర్తిగా దెబ్బతింటుంది. పైగా అక్కడ వాతావరణం చాలా ప్రమాదకరం. కేవలం డబ్బుల గురించో, ఖర్చుల గురించో మేము ఈ నిర్ణయం తీసుకోలేదు. హిమాలయాలతో ఎంతో అనుబంధం ఉన్న ఒక పర్వతారోహకుడిగా ఆయన ఆత్మ కూడా అక్కడే ప్రశాంతంగా విశ్రమించాలని కోరుకుంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం.' అని సుధీర్ చెప్పారు.
కల కోసం రెండోసారి వెళ్లి
అరుణ్ కుమార్ తివారీ సామాన్య పర్వతారోహకుడు కాదు. ఆయన గతంలో మౌంట్ ఎల్బ్రస్, డెనాలి, అకాన్కాగువా వంటి ప్రపంచ ప్రసిద్ధ శిఖరాలను అధిరోహించారు. ఎవరెస్ట్ను లొంగదీసుకోవాలనే కలతో 2025లోనే ఒకసారి ప్రయత్నించారు. కానీ, అప్పట్లో 7,200 మీటర్ల వద్ద ఆరోగ్యం సహకరించకపోవడంతో వెనక్కి తగ్గారు. అయినప్పటికీ పట్టువదలకుండా ఈ ఏడాది (2026) మళ్లీ వెళ్లి తన కలని నెరవేర్చుకున్నారు. కానీ, విధి ఆయన్ని తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మరో పర్వతారోహకుడి మృతి
{{/usCountry}}అరుణ్ కుమార్ తివారీ సామాన్య పర్వతారోహకుడు కాదు. ఆయన గతంలో మౌంట్ ఎల్బ్రస్, డెనాలి, అకాన్కాగువా వంటి ప్రపంచ ప్రసిద్ధ శిఖరాలను అధిరోహించారు. ఎవరెస్ట్ను లొంగదీసుకోవాలనే కలతో 2025లోనే ఒకసారి ప్రయత్నించారు. కానీ, అప్పట్లో 7,200 మీటర్ల వద్ద ఆరోగ్యం సహకరించకపోవడంతో వెనక్కి తగ్గారు. అయినప్పటికీ పట్టువదలకుండా ఈ ఏడాది (2026) మళ్లీ వెళ్లి తన కలని నెరవేర్చుకున్నారు. కానీ, విధి ఆయన్ని తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మరో పర్వతారోహకుడి మృతి
{{/usCountry}}ఇదే ఎవరెస్ట్ యాత్రలో అమెరికాకు చెందిన సందీప్ అరే అనే మరో పర్వతారోహకుడు కూడా స్నో బ్లైండ్నెస్ కారణంగా తీవ్ర అలసట కారణంగా మరణించారు. అయితే ఆయన క్యాంప్-3 వద్ద మరణించడంతో మృతదేహాన్ని క్యాంప్-2 కి తీసుకువచ్చి, హెలికాప్టర్ ద్వారా తరలించగలిగారు.
డెత్ జోన్
సముద్ర మట్టానికి 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాన్ని ‘డెత్ జోన్’ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ స్థాయిలు ఎంత తక్కువగా ఉంటాయంటే.. మనిషి ఎక్కువసేపు బ్రతకడం సాధ్యం కాదు. ఇక్కడి నుండి ఒక మృతదేహాన్ని కిందకు తీసుకురావాలంటే 8 నుండి 12 మంది నిపుణులైన షెర్పాలు ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది.
ఈ రెస్క్యూ ఆపరేషన్కు దాదాపు 75,000 డాలర్లు (మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 71 లక్షలు) ఖర్చవుతుంది. తీవ్రమైన చలి, మంచు తుఫానులు, ఆక్సిజన్ లేకపోవడం వల్ల వేరొకరి ప్రాణాలను ప్రమాదంలో పడేయడం ఇష్టం లేకనే చాలా మంది పర్వతారోహకుల కుటుంబాలు మృతదేహాలను అక్కడే వదిలేస్తుంటారు.