హైదరాబాద్ చుట్టుపక్కల మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన మూడు ఆర్డినెన్స్ల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లో తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి తన స్పందనను దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.

తుక్కుగూడ మునిసిపాలిటీకి చెందిన బరిగల రాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు. విలీనాలకు సంబంధించిన ఆర్డినెన్స్లు జారీ చేయాల్సిన అవసరం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎల్ రవిచందర్ వాదించారు. విలీనం జరిగిన విధానం తనను బాధపెట్టిందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం, మున్సిపల్ పాలన, పౌర బాధ్యతలు, స్థానిక స్వపరిపాలన సంస్థల స్వయంప్రతిపత్తిపై అభ్యంతరకరమైన ఆర్డినెన్స్లు చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉన్నాయని ఆరోపించారు.
పిటిషన్ ప్రకారం ఆర్డినెన్స్లు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లతో సంప్రదింపులు, అభ్యంతరాలను ఆహ్వానించడం వంటి ముందస్తు చట్టబద్ధమైన రక్షణలను లేవని వాదనలు వినిపించారు. ఈ విధానం స్థానిక స్వపరిపాలనను నియంత్రించే విధానాన్ని దెబ్బతీస్తుందని వాదించారు. వచ్చే మున్సిపల్ ఎనికల్లో పిటిషనర్ పోటీ చేయాలనుకుంటున్నారని, విలీనం నేపథ్యంలో హద్దులు మారడంతో ఇతర ప్రభావం పడుతుందని చెప్పారు.
నోటిఫికేషన్కు ముందు మున్సిపల్ కార్పొరేషన్తో సంప్రదింపులు లేవని, ఇది పారదర్శకంగా లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ ఆర్డినెన్స్లు ప్రస్తుత ప్రభుత్వ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేశాయని, వికేంద్రీకరణ, సమాఖ్య పాలన రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ వాదించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ, సమీప మున్సిపాలిటీలను విలీనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన జారీ చేసిన ఆర్డినెన్స్ 9, 10, 11లను సవాల్ చేస్తూ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేసిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వా్న్ని ఆదేశించింది.
{{/usCountry}}గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ, సమీప మున్సిపాలిటీలను విలీనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన జారీ చేసిన ఆర్డినెన్స్ 9, 10, 11లను సవాల్ చేస్తూ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేసిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వా్న్ని ఆదేశించింది.
{{/usCountry}}