రక్తసంబంధాలను మధ్యలో వచ్చిన బంధాల కోసం వదులుకుంటున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. ఎన్ని ఘటనలు జరిగినా, ఎంత మంది చెప్పినా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. కనిపెంచినవారినే బయటివ్యక్తుల కోసం చంపేస్తున్నారు. సికింద్రాబాద్లో ఇలాంటి ఘోరమైన ఘటన జరిగింది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

సికింద్రాబాద్లోని జవహర్నగర్ ప్రాంతంలో జరిగిన ఒక ఘోరమైన ఘటనలో కుమార్తె తన ప్రియుడి సహాయంతో తల్లిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిన దాదాపు పది నెలల తర్వాత ఈ నేరం వెలుగులోకి వచ్చింది. దీంతో చుట్టుపక్కలవారు.. ఈ ఘటన తెలిసి షాక్ అయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు అంజు (45) కొన్ని నెలల క్రితం అదృశ్యమైంది. తొలుత ఆమె చిన్న కుమార్తె ఇషిక జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నా తల్లి కనిపించడం లేదని పోలీసులకు తెలిపింది. అయితే, అదృశ్యమైన మహిళ గురించి పెద్దగా విచారణ జరగకపోవడంతో ఈ కేసు పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. ఇషిక కూడా పదే పదే పోలీస్ స్టేషన్కు వెళ్లి అడగలేదు. ఆమె కూడా పెద్దగా పట్టించుకోనట్టుగానే ఉంది.
అయితే అదృశ్యమైన మహిళ అంజు పేరు మీద రిజిస్టర్ అయి, అమ్మకానికి ఉన్న ఒక స్కూటర్ను పోలీసులు గుర్తించడంతో దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. దీంతో అధికారులు కేసును మళ్లీ తవ్వుతూ వచ్చారు. విచారణలో ఇషిక తన ప్రియుడు మౌంటీ రాజ్ (25) సహాయంతో తన తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకుంది.
ఇషిక, రాజ్ సంబంధాన్ని అంజు వ్యతిరేకించినందుకే నిందితులు ఆమెను హత్య చేశారని పోలీసులు తెలిపారు. నేరం చేసిన తర్వాత, హత్యను దాచిపెట్టేందుకు ఆ ఇద్దరూ మృతదేహాన్ని తమ ఇంట్లోనే పాతిపెట్టారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఇషిక తర్వాత అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసింది. తన తల్లి కనిపించడం లేదని చుట్టుపక్కలవారిని నమ్మించింది.
{{/usCountry}}ఇషిక, రాజ్ సంబంధాన్ని అంజు వ్యతిరేకించినందుకే నిందితులు ఆమెను హత్య చేశారని పోలీసులు తెలిపారు. నేరం చేసిన తర్వాత, హత్యను దాచిపెట్టేందుకు ఆ ఇద్దరూ మృతదేహాన్ని తమ ఇంట్లోనే పాతిపెట్టారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఇషిక తర్వాత అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసింది. తన తల్లి కనిపించడం లేదని చుట్టుపక్కలవారిని నమ్మించింది.
{{/usCountry}}నిందితులు నేరాన్ని అంగీకరించిన తర్వాత.. పోలీసులు ఇంట్లోంచి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాజ్పై గతంలోనే ఓ కేసు ఉంది. తన మైనర్ కుమార్తెను వేధించారని ఫిర్యాదు చేయడంతో.. మౌంటీ రాజ్పై గతంలోనే పోక్సో కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు.