బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేటీఆర్. అయితే ఈ కేసులో ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి కావాలని ఏసీబీ కోరగా.. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ పలుమార్లు విచారణకు హాజరయ్యారు.
త్వరలో ఛార్జిషీట్

ఫార్ములా ఈ కార్ రేసింగ్లో రూ.54.88 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్టుగా ఆరోపలు వచ్చాయి. కేటీఆర్ పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని గవర్నర్కు తెలిపింది ఏసీబీ. దీంతో ఏసీబీ అధికారులకు విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. అయితే త్వరలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఏ1గా కేటీఆర్ను చూపిస్తారని చర్చ నడుస్తోంది.
క్విడ్ ప్రో కో ఆరోపణలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్లో ఈ రేసు నిర్వహించారు. అనుమతులు లేకుండా రూ. 55 కోట్లు విదేశీ కరెన్సీలో చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఈవెంట్ను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు కాంట్రాకులు ఒకే కంపెనీకి ఇచ్చారని కూడా అంటున్నారు. ఈ కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రూ.50 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారని, ఇది క్విడ్ ప్రో కో రూపంలో ఉందని ఆరోపణలు ఉన్నాయి.
ఏడాదిగా విచారణ
అక్రమాలపై అనుమానంతో ఈ రేసు రెండో సీజన్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. 2024 ఏప్రిల్లో ఏసీబీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో కేటీఆర్తోపాటుగా అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ అధికారి పేర్లు కూడా ఉన్నాయి. కాంట్రాక్టులు అక్రమంగా ఇవ్వడం, అధికార దుర్వినియోగం, రాష్ట్రానికి నష్టం కలిగించడం వంటి ఆరోపణలో ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఇప్పటికే ప్రశ్నించిన ఏసీబీ
మాజీ మంత్రి అయినందున అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ కింద విచారణ చేపట్టడానికి గవర్నర్ అనుమతి కావాలి. తాజాగా గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ ముందు హాజరై విచారణ ఎదుర్కొన్నారు కేటీఆర్. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విచారణ చేశారు. 8 నుంచి 10 గంటలు ప్రశ్నలు వేశారు అధికారులు. ఇందులో ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్లు, కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్, ఫెనాన్షియల్ రికార్డులను పరిశీలన చేశారు. అయితే దీనిపై కేటీఆర్ మాత్రం రాజకీయ కుట్ర అని అంటున్నారు. అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.
{{/usCountry}}మాజీ మంత్రి అయినందున అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ కింద విచారణ చేపట్టడానికి గవర్నర్ అనుమతి కావాలి. తాజాగా గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ ముందు హాజరై విచారణ ఎదుర్కొన్నారు కేటీఆర్. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విచారణ చేశారు. 8 నుంచి 10 గంటలు ప్రశ్నలు వేశారు అధికారులు. ఇందులో ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్లు, కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్, ఫెనాన్షియల్ రికార్డులను పరిశీలన చేశారు. అయితే దీనిపై కేటీఆర్ మాత్రం రాజకీయ కుట్ర అని అంటున్నారు. అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.
{{/usCountry}}