ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్లో యూదులు హనుక్కా ఉత్సవం జరుపుకొంటుండగా.. ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. ఈ దాడి చేసినవారిలో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్ టోలిచౌకికి చెందినవాడు. మరో వ్యక్తి అతడి కుమారుడు, ఆస్ట్రేలియా పౌరుడైన నవీద్ అక్రమ్.

ఈ కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన వ్యక్తి పాల్గొనడం భారతదేశానికి అవమానం మాత్రమే కాదు, భద్రతాపరమైన ఆందోళన కూడా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. 'ఆస్ట్రేలియాలో సిడ్నీ ఉగ్రవాద చర్యతో హైదరాబాద్ సంబంధం, మాకు అవమానకరమైన విషయమే. అంతేకాదు ఇది తీవ్రమైన జాతీయ భద్రతా సమస్య కూడా.' అని రామచందర్ రావు చెప్పారు.
నిందితులు భారతదేశం విడిచి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపి దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులను రామచందర్ రావు కోరారు. ఈ సంఘటన ప్రమాదకరమైన ధోరణిని ప్రతిబింబిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల కుటుంబ చరిత్రపై పోలీసు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
'దురదృష్టవశాత్తు, ఇందులో పాల్గొన్న వ్యక్తులు భారతదేశానికి చెందినవారు, అది కూడా హైదరాబాద్కు చెందినవారు. 27 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుండి బయటకు వెళ్లారు. హైదరాబాద్లో ఇప్పటికీ ఐఎస్ఐ, ఐఎస్ఐఎస్ కోసం చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయని నేను భావిస్తున్నాను.' అని తెలంగాణ బేజీపీ అధ్యక్షుడు చెప్పాడు.
సిడ్నీలోని బోండి బీచ్లో జరిగిన హనుక్కా కార్యక్రమంలో 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, అతడి కుమారుడు నవీద్ అక్రమ్ దాడి చేశారు. 15 మంది మరణించగా, అనేక మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో సాజిద్ అక్కడే మరణించాడు. నవీద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇప్పటి వరకు సాజిద్ భారతీయ పాస్పోర్ట్ను కలిగి ఉన్నాడని ఫిలిప్పీన్స్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ మంగళవారం తెలిపింది. అతడు హైదరాబాద్కు చెందినవాడని, కానీ 1998లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడని తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. కుటుంబంతో సంబంధాలు తక్కువగా ఉన్నాయని గుర్తించారు. సాజిద్ కాల్పుల వార్తల తర్వాత అతని కుటుంబ సభ్యులు తమ ఇంటిని వదిలి తెలియని ప్రదేశానికి వెళ్లిపోయారని తెలుస్తోంది.
{{/usCountry}}ఇప్పటి వరకు సాజిద్ భారతీయ పాస్పోర్ట్ను కలిగి ఉన్నాడని ఫిలిప్పీన్స్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ మంగళవారం తెలిపింది. అతడు హైదరాబాద్కు చెందినవాడని, కానీ 1998లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడని తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. కుటుంబంతో సంబంధాలు తక్కువగా ఉన్నాయని గుర్తించారు. సాజిద్ కాల్పుల వార్తల తర్వాత అతని కుటుంబ సభ్యులు తమ ఇంటిని వదిలి తెలియని ప్రదేశానికి వెళ్లిపోయారని తెలుస్తోంది.
{{/usCountry}}సాజిద్ అక్రమ్ గురించి దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. అతను చివరిసారిగా 2022లో హైదరాబాద్ వచ్చాడు. అది కూడా ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత మెుత్తం ఆరుసార్లు వచ్చాడు సాజిద్. సాజిత్ అక్రమ్ తండ్రి 2017 లో మరణించాడు. ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు.
హైదరాబాద్లో కామర్స్లో బ్యాచిలర్స్ పూర్తి చేసిన తర్వాత 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. అక్రమ్ ఆస్ట్రేలియాకు వెళ్లి ఒక యూరోపియన్ మహిళను వివాహం చేసుకున్నాడు. అతడికి ఒక కుమారుడు(నవీద్ అక్రమ్), కుమార్తె ఉన్నారు. సాజిద్ తన భారతీయ పాస్పోర్ట్ను తన వద్దే ఉంచుకున్నాడు.