కర్నూలు బస్సు ప్రమాదం మరవకముందే వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. అయితే మరోవైపు తాజాగా మరో ఘటన హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

బస్సులో 15 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం జరగలేదని పోలీసులు తెలిపారు. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ దగ్గర అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది బస్సు. డ్రైవర్ తప్పిదం వల్లనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.
సంగారెడ్డిలో తప్పిన ప్రమాదం
ఇంకోవైపు సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. సదాశివపేటలో శనివారం ఉదయం స్కూల్ బస్సు వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ తీగలు దానిపై తెగిపడ్డాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. బస్సును ఆపకుండా వెంటనే ముందుకు వెళ్లనిచ్చాడు డ్రైవర్. ఆ సమయంలో 25 మంది విద్యార్థులు బస్సులో ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అధికారుల తనిఖీలు
కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. బస్సులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏమైనా లోపాలు ఉన్నాయా అని తనిఖీ చేస్తున్నారు. విజయవాడ, బెంగళూరు హైవేపై ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తోపాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను పరిశీలిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను చెకింగ్ చేస్తూ.. నిబంధనలు పాటించని పలు ట్రావెల్స్ బస్సుల మీద కేసులు నమోదు చేశారు అధికారులు. బస్సు అద్దం పగిలి అలాగే ఉన్న ఓ బస్సును సీజ్ చేశారు.
శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు. బైకర్ మృతి చెందాడు. బస్సు బైక్ను ఈడ్చుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. బైక్ పెట్రోల్ లీక్ అయింది. దీంతో నిప్పు రవ్వలు చెలరేగి.. లగేజీ క్యాబిన్కు మంటలు అంటుకున్నాయి. మెల్లమెల్లగా బస్సు అంతటా మంటలు వ్యాపించాయి. లగేజీలో ఉన్న 200కు పైగా స్మార్ట్ ఫోన్లు పేలాయి. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.
{{/usCountry}}శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు. బైకర్ మృతి చెందాడు. బస్సు బైక్ను ఈడ్చుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. బైక్ పెట్రోల్ లీక్ అయింది. దీంతో నిప్పు రవ్వలు చెలరేగి.. లగేజీ క్యాబిన్కు మంటలు అంటుకున్నాయి. మెల్లమెల్లగా బస్సు అంతటా మంటలు వ్యాపించాయి. లగేజీలో ఉన్న 200కు పైగా స్మార్ట్ ఫోన్లు పేలాయి. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.
{{/usCountry}}