హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని నాంపల్లి సమీపంలోని దారూస్సలాంలో ఉన్న ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో భారీ ‘జల్సా’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 6:00 గంటల నుంచి ఆగస్టు 26వ తేదీ ఉదయం 4:00 గంటల వరకు ఈ సభ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో దారూస్సలాం పరిసర ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు మార్గాల్లో వాహనాల మళ్లింపు చేపట్టారు.

నగరంలో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలగకుండా… గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు కాకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
కీలక జంక్షన్లలో మళ్లింపులు ఇవే:
- మలక్కుంట, బేగం బజార్ ఛత్రీ వైపు నుంచి వచ్చే వాహనాలు : దారూస్సలాం రోడ్డు వైపు వచ్చే వాహనాలను అలస్కా టి-జంక్షన్ వద్ద మళ్లించి ఎంజే బ్రిడ్జ్, ఎంజే మార్కెట్ వైపు పంపిస్తారు.
- మల్లేపల్లి ఎక్స్ రోడ్, బోయగూడ కమాన్, మంగళ్హాట్ రూట్ : ఈ ప్రాంతాల నుంచి దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను అఘాపురా ఎక్స్ రోడ్ వద్ద టక్కర్వాడి, చార్మినార్ వైపు మళ్లిస్తారు.
- బజార్ ఘాట్, తాజ్ ఐలాండ్ వైపు నుంచి : దారూస్సలాం వైపు రాకుండా ఏక్ మినార్ వద్ద మళ్లించి బజార్ ఘాట్, నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు దారి మళ్లిస్తారు.
- సీతారాంభాగ్, మంగళ్హాట్ మార్గం : ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను అఘాపురా జంక్షన్ వద్ద చార్కండిల్ వైపు పంపిస్తారు.
- మెహదీపట్నం, ఆసిఫ్నగర్ వైపు నుంచి : దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్దనే మళ్లించి గోకుల్ నగర్, బజార్ ఘాట్ వైపు పంపుతారు.
సభకు హాజరయ్యే ప్రజలు తమ వాహనాలను రోడ్లపై నిలిపివేయకుండా, ట్రాఫిక్కు ఆటంకం కలిగించకుండా పోలీసు యంత్రాంగం నిర్దేశించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
- నాలుగు చక్రాల వాహనాలు : గవర్నమెంట్ డిస్పెన్సరీ హాస్పిటల్ (సీతారాంభాగ్), రాకెట్ గ్రౌండ్.
- ద్విచక్ర వాహనాలు : అఘా దర్గా, సర్దార్ బేగ్ దర్గా, పాన్ మండి రోడ్, ఎస్బీఐ రోడ్.
సభకు హాజరయ్యే ప్రజలు తమ వాహనాలను రోడ్లపై నిలిపివేయకుండా, ట్రాఫిక్కు ఆటంకం కలిగించకుండా పోలీసు యంత్రాంగం నిర్దేశించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
- నాలుగు చక్రాల వాహనాలు : గవర్నమెంట్ డిస్పెన్సరీ హాస్పిటల్ (సీతారాంభాగ్), రాకెట్ గ్రౌండ్.
- ద్విచక్ర వాహనాలు : అఘా దర్గా, సర్దార్ బేగ్ దర్గా, పాన్ మండి రోడ్, ఎస్బీఐ రోడ్.
కార్యక్రమం ముగిసే వరకు అంటే రేపు ఉదయం 4 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. వాహనదారులు ఈ ట్రాఫిక్ మళ్లింపులు గమనించి, తమ ప్రయాణాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.