టెట్ ఒత్తిడిలో ఇన్ సర్వీసు టీచర్లు.. అర్హత మార్కులలో రిలాక్సేషన్ కోరుతున్న ఉపాధ్యాయులు!

ఇటీవలే తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇందులో చాలా మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అర్హత సాధించలేదు. అర్హత మార్కులపై మరోసారి వారి నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

Published on: Feb 14, 2026, 08:12:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులలో ఆందోళనలను రేకెత్తించాయి. ఎందుకంటే చాలా కాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ముఖ్యంగా జనరల్ కేటగిరీకి చెందిన వారు అర్హత మార్కులను పొందడంలో విఫలమయ్యారనేది వాస్తవం. దీని ఫలితంగా కనీస ఉత్తీర్ణత ప్రమాణాలను తగ్గించాలనే డిమాండ్లు మళ్లీ తిరిగి వచ్చాయి.

తెలంగాణ టెట్ ఫలితాలు
తెలంగాణ టెట్ ఫలితాలు

ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య సభ్యులు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు కూడా ఒక వినతిపత్రం అందజేశారు. టెట్ అర్హత మార్కులతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో ఆందోళన ఉన్నట్టుగా పేర్కొన్నారు. అధికారిక ఫలితాల ప్రకారం, 1,00,270 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 51.37 శాతం.

ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులలో 37,893 మంది అర్హత సాధించారు. చాలా మంది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు జనరల్/ఈడబ్ల్యూఎస్ కోసం 60 శాతం, బీసీ కోసం 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ వర్గాలకు 40 శాతం అర్హత ప్రమాణాలను అందుకోలేకపోయారు.

ఉపాధ్యాయ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభావితమైన చాలా మంది అభ్యర్థులు సీనియర్ ఉపాధ్యాయులు, దశాబ్దాలుగా సవాలుతో కూడిన పరిస్థితుల్లో సేవలందిస్తున్నారని చెబుతున్నారు. వయస్సు పెరగడం, ఆరోగ్య సమస్యలు, వృత్తిపరమైన బాధ్యతలు, చాలా కాలం తర్వాత పోటీ పరీక్షలను ఎదుర్కోవడం వంటి అంశాలు అడ్డంకులుగా ఉంటున్నాయని పేర్కొంటున్నారు.

ఇతర రాష్ట్రాల్లోని ఉదాహరణలను కూడా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. బీహార్ STET అర్హత మార్కులను తగ్గించిందని, తమిళనాడు కూడా కొన్ని వర్గాలకు సడలింపులు ఇచ్చిందని గుర్తుచేస్తున్నారు. జనవరి 2026 పరీక్షకు హాజరైన సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

గతంతో పోల్చితే టీజీ టెట్ 2026కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌1, 2 కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులున్నారు. టెట్ పరీక్షకు మెుత్తంగా 1,95,181 మంది హాజరు అవ్వగా.. ఇందులో 65,605 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు.

టీజీ టెట్ 2026 ఫలితాలు ఇలా చూసుకోండి

అధికారిక వెబ్‌సైట్‌ https://tgtet.aptonline.in/tgtet/ కు వెళ్లండి

హోమ్‌పేజీలో TG TET ఫలితాలు 2026 లింక్ కోసం చూసి దానిపై క్లిక్ చేయండి.

జర్నల్ నెంబర్/హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయండి.

పేపర్ 1, పేపర్ 2లో ఏదో సెలక్ట్ చేసుకోండి. తర్వాత పుట్టిన తేదీ ఎంటర్ చేసి రిజల్ట్ చూసుకోవచ్చు.

భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.

ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలు నేరుగా చూసుకోండి

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More