ఐఆర్సీటీసీ టూరిజం అనేక రకాల టూర్ ప్యాకేజీలు అందిస్తుంది. చాలా దూర ప్రాంతాలకే కాదు. హైదరాబాద్ చుట్టు పక్కల, శ్రీశైలం లాంటి క్షేత్రాలకు కూడా ప్యాకేజీలు ఉన్నాయి. బడ్జెట్ ధరలోనే మీరు అన్ని చూసి రావొచ్చు. ఐఆర్సీటీసీ స్పిరిట్యువల్ తెలంగాణ విత్ శ్రీశైలం టూర్ ప్యాకేజీని అందిస్తోంది. మెుత్తం మూడు రాత్రులు, నాలుగు రోజులు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రయాణం మెుదలవుతుంది. డిసెంబర్ 10వ తేదీన టూర్ ప్యాకేజీ ఉంది.
నాలుగు రోజులు ఇలా

మెుదటి రోజు హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి పికప్ చేసుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అవుతారు. చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శిస్తారు. హోటల్కు తిరిగి వెళ్తారు. హైదరాబాద్లో డిన్నర్, రాత్రి బస చేయండి.
రెండో రోజు హైదరాబాద్ - శ్రీశైలం వెళ్తారు. ఉదయం 5 గంటలకు హోటల్ నుండి పికప్ చేసుకుంటారు. శ్రీశైలానికి సుమారు 5 గంటల ప్రయాణం ఉంటుంది. మధ్యలో అల్పాహారం చేస్తారు. మల్లికార్జున స్వామి ఆలయం, పరిసరాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం హైదరాబాద్కు బయలుదేరుతారు. రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి భోజనం, హైదరాబాద్లో బస చేస్తారు.
మూడో రోజు హైదరాబాద్లో తిరుగుతారు. హోటల్లో అల్పాహారం చేస్తారు. గోల్కొండ కోట, బిర్లా మందిర్ను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీ దగ్గరకు వెళ్తారు. సాయంత్రం హోటల్కు తిరిగి వెళ్లి.. హైదరాబాద్లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.
నాలుగో రోజు హోటల్లో అల్పాహారం చేసి.. చెక్ అవుట్ అవుతారు. యాదాద్రికి బయలుదేరుతారు. సురేంద్రపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయాన్ని సందర్శించండి. సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వెళ్తారు. హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగుతారు.
టూర్ ప్యాకేజీ ధర
గ్రూప్ సైట్ 1 టూ 3 ప్యాసింజర్స్ టూర్ ప్యాకేజీ ధరలు చూసుకుంటే.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19890, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.15010గా ఉంది. పిల్లలకు బెడ్తో కలిపి రూ.9860, బెడ్ లేకుండా కూడా అదే రేట్ ఉంది. 4 టూ 6 ప్యాసింజర్స్ డబుల్ ఆక్యుపెన్సీ రూ.15880, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.13500గా ఉండగా పిల్లలకు ఇందులో కూడా రూ.9860 ధర నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ సందర్శించొచ్చు.
{{/usCountry}}గ్రూప్ సైట్ 1 టూ 3 ప్యాసింజర్స్ టూర్ ప్యాకేజీ ధరలు చూసుకుంటే.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19890, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.15010గా ఉంది. పిల్లలకు బెడ్తో కలిపి రూ.9860, బెడ్ లేకుండా కూడా అదే రేట్ ఉంది. 4 టూ 6 ప్యాసింజర్స్ డబుల్ ఆక్యుపెన్సీ రూ.15880, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.13500గా ఉండగా పిల్లలకు ఇందులో కూడా రూ.9860 ధర నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ సందర్శించొచ్చు.
{{/usCountry}}