ఈ సమ్మర్ వేళ ఊటీ అందాలను వీక్షించాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారికోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ‘అల్టిమేట్ ఊటీ EX హైదరాబాద్ ’పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ఈ ప్యాకేజీలో భాగంగా ఊటీతో పాటు కూనూర్ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 31 మార్చి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందా లేదా అనేది టూరిజం వెబ్ సైట్ ( https://www.irctctourism.com/ ) లో చూసుకోవాలి.
హైదరాాబాద్ - ఊటీ షెడ్యూల్:
- తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 02.25 గంటలకు (శబరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ నెంబర్ - 20629) స్టార్ట్ అవుతారు. రాత్రి అంతా ప్రయాణంలో ఉంటారు.
- ఉదయం 9.10 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి చేరుకుంటారు. హోటల్లోకి చెకిన్ అవుతారు. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాలి.
- దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ ను సందర్శిస్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి.
- కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే బస చేయాల్సి ఉంటుంది
- ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 03.40 గంటలకు శబరి ఎక్స్ప్రెస్(రైలు నెంబర్. 20630) ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి.
- ఉదయం 11.0 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33,590గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 18,890 ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17170గా నిర్ణయించారు.
స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 31,050గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16,360, సింగిల్ షేరింగ్ కు రూ. 14,630గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 నెంబర్లను సంప్రదింవచ్చు.