కొత్త సంవత్సరం వేళ షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? బడ్జెట్ ధరలోనే ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ సిటీ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.

2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ‘సాయి సన్నిధి EX హైదరాబాద్’ పేరుతో ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది.హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ట్రిప్ 7 జనవరి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న టూరిస్టులు https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు.
టూర్ షెడ్యూల్ వివరాలు:
- డే 1 : కాచిగూడ రైల్వే స్టేషన్లో జర్నీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 06.40 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ - 17064, అజంతా ఎక్స్ ప్రెస్) ఉంటుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- డే 2 :ఉదయం 07.10 గంటలకు నాగర్సోల్ చేరుకుంటుంది. ఆ తర్వాత షిరిడీకి వెళ్లాలి. హోటల్ వెళ్లిన తర్వాత.. షిరిడీ ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 05 గంటలకు రూమ్ చెకౌట్ చేయాలి. రాత్రి 08. 30 గంటల వరకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.
- డే 3 :మూడో రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ.7890గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6660,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6640గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 4960, డబుల్ షేరింగ్ కు రూ. 4980, సింగిల్ షేరింగ్ కు రూ. 6220గా నిర్ణయించారు.
ఈ ప్యాకేజీలో టూర్ టికెట్లు, లంచ్, డిన్నర్, టూర్ గైడ్ అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యక్తిగత ఖర్చులు ఉంటే మీరు భరించుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లకు కాల్ చేయవచ్చు.