రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతుంది. ఆ దిశగా కల్వకుంట్ల రంగం సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు దూరమైన తర్వాత…. తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీసీలతో పాటు మహిళ రిజర్వేషన్ బిల్లుపై గట్టిగా వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి కార్యక్రమాలను ప్రకటిస్తూ… జనాల్లోకి వెళ్తున్నారు. జాగృతి జనం బాట పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కూడా కవిత పర్యటించారు. అయితే ఇకపై సంస్థ పేరుతో కూడా ప్రత్యేక రాజకీయ పంథాతో ముందుకెళ్లాళని భావిస్తున్నారు.
మే నెలలో పార్టీ ప్రకటన…!

మే నెల మొదటి వారంలో మంచి రోజు చూసుకుని పార్టీని అధికారికంగా ప్రకటిస్తామని కవిత తాజాగా ప్రకటించారు. తన స్థాపించబోయే పార్టీ పేరులో 'తెలంగాణ' అనే పదం తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన పోటీపై కూడా కవిత క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని చెప్పిన ఆమె…. వచ్చే ఎన్నికల్లో తన మొదటి ఛాయిస్ సిద్దిపేట అని, రెండో ఛాయిస్ బోధన్ అని వెల్లడించారు.
భవిష్యత్తులో బీజేపీ ప్రభావం క్రమంగా తగ్గిపోతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా తామే అవుతామని కవిత ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తామే వస్తామని…. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు తనతో కలిసి నడవడానికి ఆసక్తిగా ఉన్నారని కవిత చెప్పుకొచ్చారు. తాము స్థాపించబోయే పార్టీలో యువత, కొత్త వారికి పెద్దపీట వేస్తామన్నారు.
ఇక ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కవిత తన మద్దతుదారులను ఏఐబీఎఫ్ పార్టీ బీ-ఫామ్పై పోటీ చేయించారు. పలు స్థానాల్లో వారు విజయం కూడా సాధించారు. ఈ క్రమంలోనే ఓ రాజకీయ పార్టీని స్థాపించి… 2029 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్లాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్కడే ఎందుకు ఫోకస్…!
కవిత చేసిన ప్రకటనతో ఆమె రాజకీయ పార్టీని స్థాపించటం దాదాపుగా ఖరారైంది. అయితే ఆమె సిద్ధిపేట లేదా బోధన్ నుంచి పోటీ చేస్తానని చెప్పటం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆమె బీఆర్ఎస్ లోని కొందరి నేతల తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఒకరిగా హరీశ్ రావు ఉన్నారు. ప్రస్తుతం ఆయన సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు మీడియాతో మాట్లాడి కవిత… హరీశ్ రావు కేంద్రంగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఓడించటమే లక్ష్యంగా కవిత ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నారా అనే చర్చ మొదలైంది.
{{/usCountry}}కవిత చేసిన ప్రకటనతో ఆమె రాజకీయ పార్టీని స్థాపించటం దాదాపుగా ఖరారైంది. అయితే ఆమె సిద్ధిపేట లేదా బోధన్ నుంచి పోటీ చేస్తానని చెప్పటం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆమె బీఆర్ఎస్ లోని కొందరి నేతల తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఒకరిగా హరీశ్ రావు ఉన్నారు. ప్రస్తుతం ఆయన సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు మీడియాతో మాట్లాడి కవిత… హరీశ్ రావు కేంద్రంగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఓడించటమే లక్ష్యంగా కవిత ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నారా అనే చర్చ మొదలైంది.
{{/usCountry}}ఇక బోధన్ నుంచి చేసే విషయంలో కూడా కవిత ఓక్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. బోధన్ కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే బోధన్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
మొత్తంగా కవిత వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుంది..? ఏ పార్టీపై ప్రధానంగా ప్రభావం చూపబోతుందనేది భవిష్యత్ పరిణామాలతో తేలిపోనుంది.