హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ పరిధిలోని కాసు బ్రహ్మానంద రెడ్డి(KBR) నేషనల్ పార్క్ చుట్టూ ప్రయాణించే వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 18 మంగళవారం నుండి ఈ ప్రాంతంలో వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. రూ. 1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(H-CITI) ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ మార్పులు చేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు దాదాపు ఏడాదిన్నర (18 నెలలు) పాటు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

ప్రయాణికులు తమ గమ్యస్థానాలను సులభంగా చేరుకోవడానికి, అయోమయానికి గురికాకుండా ఉండటానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక లేన్ మార్కింగ్లు, లేన్ ఛేంజర్లను ఏర్పాటు చేశారు. ప్రతి రెండు జంక్షన్ల మధ్య ఒక లేన్ ఛేంజర్ అందుబాటులో ఉంటుంది.
ఇదివరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుండి ఎన్టీఆర్ భవన్ లేదా అన్నపూర్ణ బైలేన్ వైపు వెళ్లే వాహనాలు మహారాజా అగ్రసేన్ ఐలాండ్ వద్ద కుడి మలుపు తీసుకునేవి.
ఇకపై మహారాజా అగ్రసేన్ ఐలాండ్ వద్ద కుడి మలుపు తీసుకోవడం నిషేధించారు. వాహనదారులు ఐలాండ్ నుండి ఎడమ వైపు మలుపు తీసుకుని, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీదుగా ప్రయాణించి.. క్రీమ్ స్టోన్ వద్ద ఉన్న లేన్ ఛేంజర్ నంబర్ 10 ద్వారా ఎన్టీఆర్ భవన్ లేదా అన్నపూర్ణ బైలేన్కు చేరుకోవాల్సి ఉంటుంది.
ఈ వన్-వే విధానం వల్ల వాహనాలు ఒకే దిశలో సాఫీగా సాగుతాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. పౌరులు ఈ ట్రాఫిక్ నిబంధనలను పాటించి, విధుల్లో ఉన్న సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వన్ వే ట్రాఫిక్ మార్గాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్, సిసిటీవీ కెమెరాల నెట్వర్క్ ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా రియల్ టైమ్ నిఘా కోసం డ్రోన్లను కూడా రంగంలోకి దించుతున్నారు. రాంగ్ రూట్లో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
{{/usCountry}}ఈ వన్ వే ట్రాఫిక్ మార్గాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్, సిసిటీవీ కెమెరాల నెట్వర్క్ ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా రియల్ టైమ్ నిఘా కోసం డ్రోన్లను కూడా రంగంలోకి దించుతున్నారు. రాంగ్ రూట్లో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
{{/usCountry}}కేబీఆర్ పార్క్కు వచ్చే వాకర్స్ తమ వాహనాలను కేవలం కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో లేదా మల్టీ-లెవల్ పార్కింగ్ భవనంలో మాత్రమే పార్క్ చేయాలి. ముఖ్యంగా ఉదయం వేళల్లో రోడ్డుపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లలో నిత్యం తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. తాజా గణాంకాల ప్రకారం పిక్ అవర్స్లో వివిధ జంక్షన్లలో వాహనాల రద్దీ (ప్యాసింజర్ కార్ యూనిట్లు - PCU): జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ గంటకు అత్యధికంగా 15,321 PCUలు, కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ జంక్షన్ గంటకు 13,516 PCUలు, మహారాజా అగ్రసేన్ జంక్షన్: గంటకు 10,356 PCUలు, రోడ్ నంబర్ 45 జంక్షన్ గంటకు 9,966 PCUలుగా ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎమ్డీఏ సంయుక్తంగా చేపడుతున్న ఈ H-CITI ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రధాన జంక్షన్లలో ఏడు మల్టీ-లెవల్ స్టీల్ ఫ్లైఓవర్లు, ఏడు అండర్పాస్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వాహనాల రద్దీ తగ్గి, ట్రాఫిక్ కష్టాలు 80 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.