బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్లో జరిగింది. ఇందులో భాగంగా కీలక విషయాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్ రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గసభ్యులు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. పార్టీ గుర్తులతో జరిగితే బీఆర్ఎస్ సత్తా తెలిసేదన్నారు. పార్టీ గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు.. అహంకార వైఖరి ప్రదర్శించలేదన్నారు. కాంగ్రెస్ ఒక కొత్త పాలసీ కూడా తేలేదని చెప్పారు. తీసుకొచ్చిన పాలసీ.. రియల్ ఎస్టేట్ కోసమేనని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేండ్లు ఓపిక పట్టినమని కేసీఆర్ చెప్పారు. ఇగ ఊరుకునేది లేదన్నారు. రాజకీయాల్లో గెలుపులు, ఓటములు ఉండటం సహజం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాల మార్పిడులు ఉంటాయి.. కానీ ఎంత సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ను నడిపామో అది ముఖ్యం అన్నారు. తమ ప్రభుత్వం పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో కనీసం ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. మరి దాన్ని ఎందుకు వదిలిపెట్టిర్రో.. దాని వెనక ఉద్దేశం ఏంటో అని ప్రశ్నించారు. మధ్యలో కేంద్ర ప్రభుత్వం బీజేపీతో ఓ తమాషా అని కేసీఆర్ అన్నారు. మెుదటి నుంచి తెలంగాణకో శని అయిందని కామెంట్ చేశారు.
'కేంద్ర ప్రభుత్వం ప్రతీ విషయాన్ని వ్యతిరేకించడమే. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరడం.. ఆయన మాటలు పట్టుకుని ప్రతీ దాన్ని అడ్డంగా వ్యతిరేకించడమే. మేం ఉన్నన్ని రోజులు బాగా కొట్లాడినం. అనేకమైన పోరాటాలు చేశాం. పోరాటాలతో ఎప్పటికప్పుడు అనుమతులు సాధించుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఎంపీల అవసరం ఉంది కదా. అందుకోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది.' అని కేసీఆర్ అన్నారు.
{{/usCountry}}'కేంద్ర ప్రభుత్వం ప్రతీ విషయాన్ని వ్యతిరేకించడమే. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరడం.. ఆయన మాటలు పట్టుకుని ప్రతీ దాన్ని అడ్డంగా వ్యతిరేకించడమే. మేం ఉన్నన్ని రోజులు బాగా కొట్లాడినం. అనేకమైన పోరాటాలు చేశాం. పోరాటాలతో ఎప్పటికప్పుడు అనుమతులు సాధించుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఎంపీల అవసరం ఉంది కదా. అందుకోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది.' అని కేసీఆర్ అన్నారు.
{{/usCountry}}తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీకి వెళ్లి.. కేంద్రం మెడలు వంచామని కేసీఆర్ అన్నారు. ఢిల్లీలో 80 లక్షల టన్నులు మేం తీసుకుంటామన్నారు. వడ్లు కొనకపోతే.. మేమంతా హడావుడి చేసి పోయినమని, కానీ ప్రధానమైన మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డీపీఆర్ వాసప్ పంపిస్తే.. వీళ్లు చడీచప్పుడు లేదని విమర్శించారు.