ఇటీవలే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య వరంగల్ రాజకీయం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తమ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కొండా దంపతులు వరంగల్ నగరంలో తమ అనుచరులు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
బర్తరఫ్ తర్వాత తొలి భేటీ..!

వాస్తవానికి ఈ సమావేశాన్ని వరంగల్లోని కొండా సురేఖ నివాసం వద్ద నిర్వహించాలని భావించారు. అయితే, నగరంలో కురుస్తున్న వర్షం కారణంగా వేదికను మార్చాల్సి వచ్చింది. వర్షం తగ్గకపోవడంతో కార్యకర్తల భేటీని సమీపంలోని ఓహోటల్కు మార్చారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొండా దంపతులు తమ నియోజకవర్గ నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలతో విస్తృత స్థాయిలో ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి కావడంతో ఈ సమావేశానికి తీవ్ర ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు… కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖకు కేబినెట్ స్థాయి కలిగిన ప్రాధాన్యత గల పదవిని ఇచ్చే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేబినెట్ నుంచి తొలగించినప్పటికీ, పార్టీకి ఆమె అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని సముచిత స్థానం కల్పించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే వరంగల్లో కార్యకర్తలతో సమావేశం ముగిసిన వెంటనే, కొండా సురేఖ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ఆమె అనుచర వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో భేటీ అయి భవిష్యత్ రాజకీయంపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
బర్తరఫ్ అయిన తర్వాత తొలిసారిగా కార్యకర్తలతో భేటీ అవుతున్న కొండా ఫ్యామిలీ… ఎలాంటి అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్న కొండా సురేఖ…. ఈ భేటీ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లబోతారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
{{/usCountry}}బర్తరఫ్ అయిన తర్వాత తొలిసారిగా కార్యకర్తలతో భేటీ అవుతున్న కొండా ఫ్యామిలీ… ఎలాంటి అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్న కొండా సురేఖ…. ఈ భేటీ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లబోతారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
{{/usCountry}}