...
...
Next Story

తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కాదు... రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - కేటీఆర్

కాంగ్రెస్ 1000 రోజుల పాలన మోసాలపై కరీంనగర్ ‘యువ సమరభేరి’ సభలో కేటీఆర్ విరుచుకుపడ్డారు. 420 హామీలు నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Published on: Sep 5, 2026, 15:17:22 IST
Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో భారీ ‘యువ సమరభేరి’ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన కేటీఆర్…. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేసీఆర్ కాదు… రేవంత్ రాజీనామా చేయాలి- కేటీఆర్

కరీంనగర్ సభలో కేటీఆర్
కరీంనగర్ సభలో కేటీఆర్

తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయడం ఏంటి….? 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు గడిచినా నిరుద్యోగులను, ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి" అని డిమాండ్ చేశారు.

"2006లో కూడా ఇదే కరీంనగర్ గడ్డపై కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. అప్పట్లో కేసీఆర్ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తే కరీంనగర్ ప్రజలు కాంగ్రెస్ వీపు పగలేలా తీర్పు ఇచ్చారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో ఆయనే కేసీఆర్. ఇప్పుడు మళ్లీ కేసీఆర్‌తో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి అదే గతి పడుతుంది, జాగ్రత్త" అని హెచ్చరించారు. చేసిన మోసాలకు గాను 420 హామీలకు 420 సార్లు కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయాలని అన్నారు. ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ప్రజలు బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, "రాష్ట్రంలో యువతకు స్కిల్ లేదని మాట్లాడే సీఎం రేవంత్‌కు అసలు స్కిల్ ఉందా? ఆయనకు సరిగ్గా దరఖాస్తు రాయడం కూడా రాదు. అక్షర దోషం లేకుండా ఏ భాషలోనూ రాయలేడు," అని ఎద్దేవా చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టి నిలదీస్తామని వెల్లడించారు.

యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని కేటీఆర్ వరుసగా ప్రశ్నించారు. “ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.. చేశారా? ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం స్థానికులకే రిజర్వేషన్ చట్టం తెస్తామన్నారు.. ఏమైంది? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చారా? యువతకు రూ.10 లక్షల రుణాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇచ్చారా?” అని కేటీఆర్ నిలదీశారు.

అప్పుడు ‘యూత్ డిక్లరేషన్’ అన్న కాంగ్రెస్…. ఇప్పుడు ‘బూతు డిక్లరేషన్’తో ప్రజలను బూతులు తిడుతోందని మండిపడ్డారు. హామీల గురించి నిలదీస్తే సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి, మంత్రులు వాటాల కోసం కొట్టుకుంటున్నారని ఆరోపించారు.

అశోక్ నగర్‌లో అడుగుపెట్టి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ, ఓట్లు వేయించుకున్నాక అడ్రస్ లేకుండా పోయారని కేటీఆర్ విమర్శించారు. "రేవంత్ దగ్గర నెలకోసారి కలెక్షన్లు తీసుకుంటూ రాహుల్ గాంధీ ఢిల్లీలో మూటలు దాచుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం సీటును నెలకు ఒకసారి రెన్యువల్ చేయించుకుంటున్నారు. మీరు ఇక్కడికి రాకపోతే నిరుద్యోగ యువతతో కలిసి మేమే ఢిల్లీకి వస్తాం" అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు కానీ ‘స్కామ్ క్యాలెండర్’ నడుస్తోందని, నోటిఫికేషన్లు రావడం లేదు కానీ ‘లూటిఫికేషన్’ మాత్రం సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బూడిదయ్యే వరకు నిరుద్యోగులు నిప్పుకణికలై పోరాడాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్ని తరాల పాటు కనిపించకుండాపోయేలా యువత తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe