భూములకు సంబంధించి ప్రతి అంగుళాన్నిడిజిటలైజ్ చేసి, యజమానులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ధరణి ద్వారా సృష్టించిన చిక్కుముడులను విప్పుతూ రైతులకు చుట్టంలా ఉండేలా భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చామన్నారు. ఖమ్మం కలెక్టరేట్(ఐడీఓసీ)లో శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్లను అందజేశారు మంత్రి.

భూ సర్వే కోసం గతంలోని టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి, సెంటీమీటర్ల తేడాతో ఖచ్చితత్వం వచ్చేలా రోవర్స్ సాంకేతికతను వాడుతున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఇప్పటికే 600 రోవర్లను కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను మండలాల వారీగా భూ విస్తీర్ణం ప్రాతిపదికన కేటాయించామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో రెండో విడతలో అర్హత సాధించిన 47 మందికి ఈరోజు నియామక పత్రాలు అందజేసినట్టుగా వెల్లడించారు.
'గత పాలకులు తెచ్చిన ధరణిలో జరిగిన లోపాలపై ఇప్పటికే సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేశాం, ఆ నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 31 జిల్లాల్లోనూ ఆడిట్ నిర్వహిస్తాం. రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు, భూభారతిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. గత పాలనలో తెచ్చిన ధరణి లొసుగుల వల్లే ఈ రోజు ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము పక్కదారి పట్టింది. ధరణి లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదు. ఎంతటి వారైనా విడిచిపెట్టం క్రిమినల్ కేసులు పెట్టి చట్ట పరంగా శిక్షిస్తాం.' అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
రైతు చెంతకే భూధార్.. సర్వే వ్యవస్థలో విప్లవం ఇది అని మంత్రి పొంగులేటి చెప్పారు. పాత పద్ధతులకు ఇక స్వస్తి పలికి ఆధునిక రోవర్స్తో భూ కొలతలు ఉంటాయన్నారు. క్షేత్రస్థాయిలోకి లైసెన్స్డ్ సర్వేయర్లు పని చేస్తారని తెలిపారు. అక్రమాల నుండి రైతులు, భూ యజమానులకు రక్షణ కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని పొంగులేటి చెప్పారు. దానిలోనే భాగంగానే భూభారతి పోర్టల్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ NICకి భూ రికార్డులను భద్రపరిచే బాధ్యత అప్పగించామన్నారు. త్వరలో ఈ వెబ్ పోర్టల్ అందుబాటులోకి రానుందన్నారు.
{{/usCountry}}రైతు చెంతకే భూధార్.. సర్వే వ్యవస్థలో విప్లవం ఇది అని మంత్రి పొంగులేటి చెప్పారు. పాత పద్ధతులకు ఇక స్వస్తి పలికి ఆధునిక రోవర్స్తో భూ కొలతలు ఉంటాయన్నారు. క్షేత్రస్థాయిలోకి లైసెన్స్డ్ సర్వేయర్లు పని చేస్తారని తెలిపారు. అక్రమాల నుండి రైతులు, భూ యజమానులకు రక్షణ కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని పొంగులేటి చెప్పారు. దానిలోనే భాగంగానే భూభారతి పోర్టల్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ NICకి భూ రికార్డులను భద్రపరిచే బాధ్యత అప్పగించామన్నారు. త్వరలో ఈ వెబ్ పోర్టల్ అందుబాటులోకి రానుందన్నారు.
{{/usCountry}}ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ , ఖమ్మం మున్సిపల్ కమిషనర్, వైరా ఎమ్మెల్యే , గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి మృతుల కుటుంబాలకు పరిహారం
హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై మంత్రి పొంగులేటి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని భరోసా ఇచ్చారు.