తెలంగాణలో వైన్స్ షాపుల టెండర్ల గురించి ఆశావహులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 27వ తేదీన లక్కీ డ్రా ఉదయం ముదలైంది. కొన్ని ప్రాంతాల్లో ఆసక్తికరంగా కొందరికి మద్యం షాపుల లక్కీ డ్రాలో లక్కు ఎక్కువగా కలిసి వస్తుంది. ఎందుకంటే కొందరు కలిసి టెండర్లు వేశారు. అంటే ఎక్కడ టెండర్ తగిలినా.. దానిలో సమానంగా ఉంటుంది. ఇలా కొంతమంది కలిసి టెండర్లు వేస్తారు. లక్కీ డ్రాలో లైసెన్స్ వస్తే.. అంతా సమానంగా ఉంటారు. అయితే కొందరికి లక్కీ డ్రాలో మూడు షాపులు కూడా కలిసి వచ్చాయి.

సంగారెడ్డిలో కె.వంశీధర్ రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి 100కి పైగా దరఖాస్తులు దాఖలు చేశాడు. పటాన్చెరులో మూడు మద్యం దుకాణాల లైసెన్స్లను పొందాడు. కేటాయించిన మూడు అవుట్లెట్లు అతడి పేరు మీదకు రావడంతో ముగ్గురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 100కి పైగా దరఖాస్తులు దాఖలు చేశారు వీరు. పటాన్చెరు ప్రాంతంలో మూడు వైన్ షాపుల లైసెన్స్లను పొందగలిగారు.
సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో మద్యం దుకాణాల టెండర్ల కోసం లాట్ల డ్రా నిర్వహించారు. దరఖాస్తుదారుడు కె. వంశీధర్ రెడ్డి, అతని స్నేహితులు హరీష్, మురళి సంయుక్తంగా 100 కి పైగా దరఖాస్తులను సమర్పించారు. ఆసక్తికరంగా వారు గెలుచుకున్న మూడు దుకాణాలు వంశీధర్ రెడ్డి పేరుతో నమోదు అయ్యాయి. నంబర్ 32, 34, 40 వారికి వచ్చాయి.
మరోవైపు ఇదే జిల్లాలో వైన్స్ టెండర్ ప్రక్రియలో ఇంకో ఆసక్తికర సన్నివేశం వెలుగుచూసింది. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నరసింహ గౌడ్, దిపీల్ గౌడ్, ప్రభు గౌడ్ కలిపి సిండికేట్గా టెండర్లు వేశారు. వారికి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని షాప్ నెంబర్ 82, 83, 84 వరుసగా తగిలాయి. మూడు షాపలకు లక్కీ డ్రా తీయగా టోకెన్ ద్వారా ఆ షాపులు వీరికి వచ్చాయి. వరుసగా హ్యాట్రిక్ కిక్కు వీరి సొంతమైంది. దీంతో వారికి ఆనందానికి అవధుల్లేవ్.
తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. దీనితో రూ. 2,863 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణం దరఖాస్తుకు ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రీఫండబుల్ ఫీజు వసూలు చేసిన తర్వాత ఈ ఆదాయాన్ని ఆర్జించింది ప్రభుత్వం. గురువారం గడువు ముగిసే సమయానికి 95 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజున, నాంపల్లిలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో సహా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, ఎక్సైజ్ పోలీసు పరిమితుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు కనిపించాయి.
{{/usCountry}}తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలకు 95,436 దరఖాస్తులు వచ్చాయి. దీనితో రూ. 2,863 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం దుకాణం దరఖాస్తుకు ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రీఫండబుల్ ఫీజు వసూలు చేసిన తర్వాత ఈ ఆదాయాన్ని ఆర్జించింది ప్రభుత్వం. గురువారం గడువు ముగిసే సమయానికి 95 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజున, నాంపల్లిలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో సహా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, ఎక్సైజ్ పోలీసు పరిమితుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు కనిపించాయి.
{{/usCountry}}రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లో 2,620 ఏ4 మద్యం దుకాణాలకు లైసెన్స్లు మంజూరు చేయడానికి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చివరి తేదీని అక్టోబర్ 23 వరకు పొడిగించారు. చివరి రోజున దరఖాస్తులు భారీగా పెరిగాయి. శంషాబాద్, మేడ్చల్, సికింద్రాబాద్, నల్గొండ వంటి ప్రాంతాల్లో అత్యధిక దరఖాస్తులు చివరిరోజున వచ్చాయి. తాజాగా అక్టోబర్ 27న లక్కీ డ్రా నిర్వహించారు.