కరీంనగర్ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అంతేకాదు ఇందులో పోలీసులు తనన వేధిస్తున్నారని ఆరోపణలు చేశాడు. అందుకే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులకు విచారణ చేయగా.. ఆ వ్యక్తి కేవలం బెదిరించడానికి, అతడిపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు ఇలా చేశాడని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కరీంనగర్ జిల్లాలో క్రిమినల్ చర్యలను తప్పించుకునేందుకు నకిలీ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీరియల్ క్రిమినల్ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి నిందితుడిని రోమాల ఉదయ్గా వెల్లడించారు. అతనిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోలీసులపై ఆరోపణలు చేస్తూ విషం తాగినట్లు కనిపించే సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు.
స్థానిక మహిళ దాఖలు చేసిన వేధింపుల ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు వచ్చింది. ఉదయ్ ఫిర్యాదు చేసిన మహిళతో స్నేహం చేశాడని తెలిసింది. ఉదయ్ని ఆమె తిరస్కరించి మరొక వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక అప్పటి నుంచి ఆమెను వేధించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. జనవరి 18న ఉదయ్, అతని సహచరులు ఆ మహిళను, ఆమెకు కాబోయే భర్తను చంద్రపురి కాలనీకి కిడ్నాప్ చేశాడు. కాబోయే భర్తపై దాడి చేసి రూ.2,000, మోటార్ సైకిల్ను దోచుకున్నారు.
మహిళ ఫిర్యాదు తర్వాత ఉదయ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. పోలీసు అధికారులు తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. ఆ ఫుటేజీలో అతను పురుగుమందు తాగినట్లుగా నటించాడు. దీనితో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
టెక్నాలజీ ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. వీణవంక, కరీంనగర్ పోలీస్ స్టేషన్లలో అతనిపై గతంలో రెండు కేసులు నమోదయ్యాయని దర్యాప్తులో తేలింది. నకిలీ ఆత్మహత్య బెదిరింపులు, చట్టపరమైన చర్యలను అడ్డుకోవడానికి లేదా అధికారుల పరువు తీయడానికి వీడియోలను విడుదల చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
{{/usCountry}}టెక్నాలజీ ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. వీణవంక, కరీంనగర్ పోలీస్ స్టేషన్లలో అతనిపై గతంలో రెండు కేసులు నమోదయ్యాయని దర్యాప్తులో తేలింది. నకిలీ ఆత్మహత్య బెదిరింపులు, చట్టపరమైన చర్యలను అడ్డుకోవడానికి లేదా అధికారుల పరువు తీయడానికి వీడియోలను విడుదల చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
{{/usCountry}}