ఆర్టీసీ లో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు అనుగుణంగా బస్సు రూట్ లు పెంచేలా స్టడీ చేయాలన్నారు. గురువారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన… పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపో లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ఆదేశించారు. లాభాల్లోకి వచ్చేలా ఆయా డిపోలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అరంఘార్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మాణం కోసం ఆర్టీసీ , పోలీస్ శాఖల భూ బదలాయింపు పై చర్చించాలన్నారు. నగరంలో కొత్త బస్సు డిపో లకు స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ తో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు.
బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు చేయాలని మంత్రి పొన్నం సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీ లో బస్ టెర్మినల్ ఏర్పాటు ,బస్సు సౌకర్యాల పై అధ్యయనం చేయాలని వివరించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కండక్టర్ లు ,డ్రైవర్లు ఇతర ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ - మంత్రి పొన్నం
ఇప్పటికే ఆర్టీసీలో ఆర్టీసీలో 1000 డ్రైవర్లు,743 శ్రామిక్ పోస్టుల భర్తీకి ప్రాసెస్ నడుస్తోంది. త్వరలోనే పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇదిలా ఉండగానే ఆర్టీసీ మంత్రి పొన్నం మరో శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో మరో కొత్త నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్టీసీలో 114 సూపర్వైజర్ ట్రైనీ, 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. టీజీపీఎస్సీ లేదా పోలీస్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తామని వివరించారు. ఇక కారుణ్య నియామకాల కింద చేరిన కండక్టర్లకు ఉన్న 3 ఏళ్ల ప్రొవిజన్ను 2 ఏండ్లకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
{{/usCountry}}ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్టీసీలో 114 సూపర్వైజర్ ట్రైనీ, 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. టీజీపీఎస్సీ లేదా పోలీస్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తామని వివరించారు. ఇక కారుణ్య నియామకాల కింద చేరిన కండక్టర్లకు ఉన్న 3 ఏళ్ల ప్రొవిజన్ను 2 ఏండ్లకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
{{/usCountry}}