తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ లో మరోసారి మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిల లక్ష్యంగా కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇవాళ పరకాల నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా సుష్మితా పటేల్ ప్రసంగించారు. పరకాల నియోజకవర్గ రాజకీయాలపై సుష్మితా పటేల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని అన్నారు. పొంగులేటి ముఖ్యమంత్రా.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? అసలు ఎవరు సీఎం అనేది అర్థం కావడం లేదంటూ ఘాటుగా మాట్లాడారు.
ఎవరొచ్చినా నేనే ఎమ్మెల్యే….
"రేవంత్ రెడ్డి నువ్వొచ్చినా, ప్రకాశ్ రెడ్డి వచ్చినా… ఆయన తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యేను నేనే. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా నేనే నిల్చుంటా… నేనే గెలుస్తా" అని సుష్మితా పటేల్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు ఆగడం ఎందుకని ప్రశ్నించిన ఆమె….. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో ఇప్పుడే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రేవూరిని రాజీనామా చేయించి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ప్రచారం చేసినా సరే, అక్కడ రేవూరి గెలవరని జోస్యం చెప్పారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి చూపిస్తానని బహిరంగంగా సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 'అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్' రాజకీయం నడుస్తోందని సుష్మితా పటేల్ ఎద్దేవా చేశారు. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న అసలు కాంగ్రెస్ నాయకులు, సభ్యులు ఎవరూ సంతోషంగా లేరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సలహాదారుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పనితీరును ప్రశ్నిస్తూ….. గత మూడేళ్లలో ఆయన ఇచ్చిన సలహాలు ఏంటో చెప్పాలని నిలదీశారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి తన సోదరుడి షెల్ కంపెనీ కోసం దాదాపు రూ. 200 కోట్ల విలువైన విలువైన భూమిని కేటాయించారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి వద్దకు వెళ్తే అపాయింట్మెంట్ దొరకడం లేదని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆవేదనతో తమ ఇంటికి వస్తున్నారని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఒకసారి ప్రజల చేతిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి…. ఇప్పుడు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
{{/usCountry}}ముఖ్యమంత్రి వద్దకు వెళ్తే అపాయింట్మెంట్ దొరకడం లేదని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆవేదనతో తమ ఇంటికి వస్తున్నారని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఒకసారి ప్రజల చేతిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి…. ఇప్పుడు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
{{/usCountry}}హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు రేవంత్ రెడ్డి ఫోటోలు మాత్రమే వేశారని, అక్కడే ఉన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో ఎందుకు వేయలేదని నిలదీశారు. బీసీ నాయకులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చులకనా అని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ … "నీతో ఉన్న పొంగు ఎక్కువ సేపు పొంగదు. అక్కడ అసలు నువ్వు ముఖ్యమంత్రో లేక ఆయనే ముఖ్యమంత్రో అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానించారు.