హైదరాబాద్లో ఏటా జరిగే నుమాయిష్ మెుదలైంది. సుమారు నెలా పదిహేను రోజులపాటు నాంపల్లి నుమాయిష్ జరుగుతుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు వెళ్లవచ్చు. సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఉంటుంది.

నుమాయిష్ కోసం వచ్చేవారి కోసం నగర శివారు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మెట్రో రైలు సేవలను కూడా వినియోగించుకోవచ్చు. మెట్రో సేవలు రోజులలో రాత్రి 11.30 గంటల వరకు, వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాలలో అర్ధరాత్రి వరకు పనిచేస్తాయి. సెక్యూరిటీపై ఎక్కువ ఫోకస్ చేసింది పాలకవర్గం. అజంతాగేట్, గాంధీభవన్, మాలకుంట రోడ్, ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. తనిఖీ చేసిన తర్వాతే సందర్శకులను లోపలికి పంపిస్తారు. వృద్ధుల కోసం వాలంటీర్లతో వీల్ చైర్లు ఉన్నాయి.
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 2026(నుమాయిష్) టిక్కెట్ ధరను పెంచినట్లు అనేక వార్తలు వచ్చాయి. జనవరి 2025లో రుసుమును రూ.40 నుండి రూ.50కి పెంచారు. ఈసారి కూడా 50 రూపాయలే.. దానిలో ఎటువంటి మార్పు లేదు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రవేశం ఉచితం. 45 రోజుల పాటు జరగనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,050 మంది తయారీదారులు, చేతివృత్తులవారు, స్థానికులు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రైవేట్ ప్రదర్శనకారులతో పాటు స్టాల్స్ను ఏర్పాటు చేస్తాయి. నుమాయిష్లో వివిధ రకాల వంటకాలను అందించే 20 ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి.
ట్రాఫిక్ మళ్లింపు
మరోవైపు నాంపల్లి చుట్టూ ట్రాఫిక్ సజావుగా సాగేలా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు జనవరి 1 నుండి ఫిబ్రవరి 15, 2026 వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయి.
{{/usCountry}}మరోవైపు నాంపల్లి చుట్టూ ట్రాఫిక్ సజావుగా సాగేలా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు జనవరి 1 నుండి ఫిబ్రవరి 15, 2026 వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయి.
{{/usCountry}}సుల్తాన్ బజార్, జంబాగ్ నుండి వచ్చే ఆర్టీసీ జిల్లా బస్సులు , ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఎంజే మార్కెట్ వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
అదేవిధంగా బషీర్ బాగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రాంతం నుండి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్, బీజేఆర్ విగ్రహం వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
బేగంబజార్ చత్రి నుండి మలకుంట వైపు వెళ్లే భారీ, మధ్యస్థ వాహనాలను అలాస్కా జంక్షన్ వద్ద దారుసలం, ఏక్ మినార్ మీదుగా మళ్లిస్తారు.
దారుసలం నుండి అఫ్జల్గంజ్ లేదా అబిడ్స్ వైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్ వద్ద బేగంబజార్, సిటీ కాలేజ్, నయాపూల్ వైపు మళ్లిస్తారు.
మూసా బౌలి, బహదూర్పురా నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సహా భారీ, మధ్య తరహా వాహనాలను సిటీ కాలేజీ వద్ద నయాపూల్, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తామని పోలీసులు తెలిపారు .
ప్రయాణికులు పలు సమయాల్లో ఎంజే మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి జంక్షన్ మార్గాన్ని నివారించాలని అధికారులు సూచించారు.