TG Double Bedroom Houses : డబుల్ బెడ్ రూమ్ ఇంటిని అద్దెకిచ్చారా..? మీలాంటి వాళ్లకు నోటీసులు

Telangana Double Bedrooms : డబుల్ బెడ్ రూం ఇళ్లు పొంది వాటిలో నివ‌సించ‌కుండా అద్దెకు ఇస్తున్న‌వారికి నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశాలిచ్చారు.అన‌ర్హుల స్ధానంలో అర్హుల‌కు అలాంటి ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు.

Published on: Mar 16, 2026, 21:41:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాల క్యూర్ (కోర్ అర్భ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ) ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిర్మాణానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సిద్దం చేయాల‌ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నివ‌సించే పేద ప్ర‌జ‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా స్ధ‌లాల‌ను గుర్తించాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని…. దీనికి త‌గ్గ‌ట్టుగా అధికారులు ప‌నిచేయాల‌ని ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

సోమ‌వారం స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో స‌హ‌చ‌ర మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు గారు, అజారుద్దీన్‌ , పొన్నం ప్ర‌భాక‌ర్‌ తో క‌లిసి క్యూర్‌ ఏరియాలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు, అలాగే డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌కు పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల ఎంపిక ఉండాల‌న్నారు. ఎలాంటి రాజ‌కీయ వ‌త్తిళ్ల‌కు త‌లొగొద్ద‌ని అధికారుల‌కు స్ప‌ష్ట‌ం చేశారు.

అద్దెకిస్తే నోటీసులు - మంత్రి పొంగులేటి

డబుల్ బెడ్ రూం ఇళ్లు పొంది వాటిలో నివ‌సించ‌కుండా అద్దెకు ఇస్తున్న‌వారికి, ఏళ్ల త‌రబ‌డి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్న‌వారికి నోటీసులు జారీ చేయాల‌ని మంత్రి పొంగులేటి సూచించారు. నోటీసుల‌కు స్పందించ‌ని వారి ఇళ్ల‌ను ర‌ద్ధు చేసి అర్హులైన పేద‌ల‌కు కేటాయించాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌మందికి నోటీసులు ఇచ్చారు, ఎంత‌మంది స్పందించారు అక్క‌డ నివాసం ఉండ‌క‌పోవ‌డానికి వారు చెప్పిన కార‌ణాలపై ఆరా తీశారు. 2 బిహెచ్‌కే, జెఎన్ ఆర్.ఎమ్ త‌దిత‌ర ప‌థకాల్లో ఇళ్లు పొంది నివాసం ఉండని ఇళ్లను మే 1వ తేదీ నుంచి ప‌రిశీలించాల‌న్నారు. అటువంటి వారికి నోటీసులు ఇచ్చి…. స్పందించని పక్షంలో కేటాయింపులను రద్దు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

నోటీసుల‌పై స్పందించిన ల‌బ్దిదారుల నుంచి బాండు పేప‌రుపై తాము ఇక్క‌డే నివాసం ఉంటామ‌ని లేదంటే ర‌ద్దు చేసే అధికారం ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తూ వారి నుంచి హామీ పొందాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు ఆమోదం తెలిపేలా అండ‌ర్ టేకింగ్ తీసుకోవాల‌ని సూచించారు.

నాలుగు జిల్లాల ప‌రిధిలోగ‌ల కాల‌నీల్లో ముఖ్యంగా విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి క‌నీస వ‌స‌తుల‌ను త‌ప్ప‌ని స‌రిగా క‌ల్పించాల‌ని… ఈ విష‌యంలో జిహెచ్ ఎంసీ స‌హ‌కారాన్ని తీసుకోవాల‌ని సూచించారు. ముఖ్యంగా 22వేల‌ ఇళ్లకు విద్యుత్ మీట‌ర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూం ట‌వ‌ర్లు మొత్తం పూర్త‌య్యేవ‌ర‌కూ ఆగ‌కుండా పూర్త‌యిన వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ల‌బ్దిదారుల‌కు కేటాయించాల‌న్నారు. అదేవిధంగా వివిధ కాల‌నీల్లో ఉన్న వాణిజ్య స‌ముదాయాల‌ను అద్దె ప్రాతిప‌ద‌క‌న గాకుండా వేలం ప‌ద్ద‌తిలో వాటిని విక్ర‌యించాల‌ని ఆ విధంగా వ‌చ్చిన డ‌బ్బును అక్క‌డి సొసైటీ, ప్ర‌భుత్వం పేరిట జాయింట్ అకౌంట్ పేరిట వేయాల‌న్నారు. అంతేగాక ప్ర‌జా ప్ర‌యోజ‌న కార్యాల‌యాల కోసం కూడా కొన్నింటిని కేటాయించాల‌ని తెలిపారు. ఈ విష‌యంలో స‌హ‌కార శాఖ స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌న్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More