నర్సంపేట మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గుండెపోటుతో ఆస్పత్రికి తరలింపు…

ప్రాథమిక సమాచారం ప్రకారం…. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం సడన్గా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు లక్షణాలు కనిపించడంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు, ఆయనను చికిత్స నిమిత్తం అత్యవసరంగా వరంగల్లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యులు ఆయన్ను కాపాడేందుకు శ్రమిస్తున్నారు.
విషయం తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తమ పర్యటనలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ నుంచి వరంగల్ బయల్దేరి వెళ్లారు.
ఎలాంటి ఇబ్బంది లేదు - వైద్యులు
రోహిణి హాస్పిటల్ సూపరిండెంట్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సీపీఆర్ జరుగుతుందని వివరించారు. మరణ వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. హార్ట్ బీట్ వచ్చిందని… ప్రస్తుతం నిలకడగా ఉన్నాడని పేర్కొన్నారు.
మెరుగైన వైద్య చికిత్స కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఉన్న అంబులెన్స్ వెంటే కేటీఆర్, హరీశ్ రావ్ బయల్దేరారు. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి… ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
ఉద్యమ నాయకుడిగా నర్సంపేట నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ స్వప్నం సాకారమైన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా నర్సంపేట అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన విజయాన్ని అందుకోలేకపోయారు.
ఓటమితో కుంగిపోకుండా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గ సమస్యలపై పోరాటం సాగించారు. దాని ఫలితంగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్లీ పోటీ చేసి ఘన విజయం సాధించారు. నర్సంపేట శాసనసభ్యుడిగా ఎన్నికై, 2018 నుంచి 2023 వరకు ఐదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గ ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.
{{/usCountry}}ఓటమితో కుంగిపోకుండా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గ సమస్యలపై పోరాటం సాగించారు. దాని ఫలితంగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్లీ పోటీ చేసి ఘన విజయం సాధించారు. నర్సంపేట శాసనసభ్యుడిగా ఎన్నికై, 2018 నుంచి 2023 వరకు ఐదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గ ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.
{{/usCountry}}