Kachiguda Murdeshwar Express : హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల డిమాండ్, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ నుంచి మురదేశ్వర్ వరకు నడుస్తున్న వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును మరింత ముందుకు పొడిగించారు. ఈ రైలును కర్ణాటకలోని కుంట వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. పర్యాటకులు, వ్యాపార వేత్తలకు ఎంతో ఉపయోగపడే ఈ పొడిగింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.

దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం….. ఈ పొడిగించిన రైలు సర్వీసు జూన్ 19, శుక్రవారం నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రైలు ప్రయాణ వేగం, కేటగిరీకి సంబంధించి రైల్వే అధికారులు ఒక కీలక స్పష్టత ఇచ్చారు. రైలు నంబర్లు 12789/12790 కలిగిన ఈ కాచిగూడ - మురుడేశ్వర్ ఎక్స్ప్రెస్, కాచిగూడ నుంచి మంగళూరు మధ్య యథావిధిగా సూపర్ఫాస్ట్ కేటగిరీలోనే నడుస్తుంది. కానీ…. మంగళూరు దాటిన తర్వాత అక్కడ నుంచి కుంట వరకు మాత్రం ఈ రైలు నాన్ సూపర్ఫాస్ట్ సర్వీసుగా ప్రయాణిస్తుంది.
టైమింగ్స్ వివరాలు….
రైలు నంబర్ 12789 ప్రతి వారం మంగళవారం, శుక్రవారాల్లో ఉదయం 6.05 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు కుంట స్టేషన్కు చేరుకుంటుంది. ఈ రైలు కుంట వెళ్లే మార్గంలో మధ్యాహ్నం 1.48 గంటలకు మురుడేశ్వర్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
తిరుగు ప్రయాణంలో…. రైలు నంబర్ 12790 ప్రతి బుధవారం, శనివారాల్లో మధ్యాహ్నం 3.25 గంటలకు కుంట నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు ప్రయాణ మార్గంలో మురుడేశ్వర్ (సాయంత్రం 4.04), భత్కల్ (సాయంత్రం 4.20), మూకాంబికా రోడ్ బైందూర్ (సాయంత్రం 4.37), కుందాపుర (సాయంత్రం 5.04), బార్కూర్ (సాయంత్రం 5.20), ఉడిపి (సాయంత్రం 5.37) స్టేషన్ల మీదుగా రాత్రి 8.00 గంటలకు మంగళూరు సెంట్రల్ చేరుకుంటుంది. అక్కడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
ఈ రైలు పొడిగింపుతో మురుడేశ్వర్, కుంట పరిసర ప్రాంతాల పర్యాటక స్థలాలను సందర్శించాలనుకునే హైదరాబాద్ ప్రయాణికులకు నేరుగా రవాణా సౌకర్యం లభించినట్లయింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి….. రైల్వే ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా కౌంటర్ల ద్వారా పొడిగించిన స్టేషన్ వరకు తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}ఈ రైలు పొడిగింపుతో మురుడేశ్వర్, కుంట పరిసర ప్రాంతాల పర్యాటక స్థలాలను సందర్శించాలనుకునే హైదరాబాద్ ప్రయాణికులకు నేరుగా రవాణా సౌకర్యం లభించినట్లయింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి….. రైల్వే ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా కౌంటర్ల ద్వారా పొడిగించిన స్టేషన్ వరకు తమ టికెట్లను రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}