తెలంగాణలో భారీగా రైల్వే ప్రాజెక్టులు.. కనెక్టివిటీ పెంచేలా కొత్త లైన్లు, విస్తరణ పనులు!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు, రద్దీని తగ్గించేందుకు గానూ భారీ కసరత్తు జరుగుతోంది. తెలంగాణతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రను కలుపుతూ పనులు జరుగుతున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే చేస్తున్న పనుల ప్రకారం.. రైల్వే బోర్డు ద్వారా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో సుమారు రూ.50,000 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందుపల్లి-దుగ్గిరాల మధ్య బైపాస్ లైన్ మాత్రమే కాదు.. 781.6 కిలోమీటర్ల బల్హర్షా-కాజీపేట-విజయవాడ-గూడూరు కారిడార్ అత్యంత ముఖ్యమైన ప్రతిపాదనలలో ఒకటి. రూ.16,800 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేసిన ఈ ప్రాజెక్ట్ రైల్వే బోర్డులో కీలక దశలను క్లియర్ చేసింది, పరిశీలనలో ఉంది.

బల్హర్షా-కాజీపేట, కాజీపేట-విజయవాడ సామర్థ్య పెంపుదల ప్రణాళికలో ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. ఈ రూట్లో సరకు రవాణా, ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. 173-కిమీ సికింద్రాబాద్-వాడి మూడు, నాల్గో లైన్ రూ.5,102 కోట్లతో మంజూరు అయింది. నెట్వర్క్లో ప్రస్తుతం ఉన్న రద్దీని తగ్గించడానికి సనత్నగర్-హఫీజ్పేట్, హఫీజ్పేట్-వాడి మధ్య మూడో/నాల్గో లైన్ను నిర్మించడం ఇందులో భాగంగా ఉంది.
ఇటీవలే కేంద్రం నుండి ఆమోదం పొందిన రూ.2,200 కోట్ల ప్రాజెక్ట్తో తెలంగాణలోని 110.4-కిమీ కాజీపేట-సికింద్రాబాద్ లైను ఇప్పటికే ఊపందుకున్న ప్రధాన ప్రాజెక్ట్గా చెప్పవచ్చు. రద్దీగా ఉండే బల్హర్షా-నాగ్పూర్ మార్గంలో ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి రూ.493 కోట్ల వ్యయంతో యవత్మాల్ జిల్లాలోని మకుత్బాన్, చంద్రపూర్ జిల్లాలోని గోడ్చందూర్ మధ్య 38.21-కిమీ కొత్త రైలు మార్గాన్ని కూడా క్లియర్ చేసింది. 130-కిమీ వికారాబాద్-కృష్ణా కొత్త లైన్ ప్రాజెక్ట్ రూ.2,884 కోట్ల అంచనాతో ఉంది.
హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదిత 222.5-కిమీ రీజినల్ రింగ్ రైల్ (ఉత్తరం) రూ.11,500 కోట్ల అంచనా వ్యయంతో సౌత్ సెంట్రల్ అధికారులు ప్రాజెక్ట్ను క్లియర్ చేసి రైల్వే బోర్డుకు ఫార్వార్డ్ చేశారు. బొగ్గు, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించే మణుగూరు-రామగుండం లైన్ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) పద్ధతిలో చేపట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతించింది.
సూర్యాపేట, నల్గొండ, నాగర్కర్నూల్, వనపర్తి మీదుగా డోర్నకల్-గద్వాల్ రైలు మార్గానికి రూ.8,269 కోట్ల కంటే ఎక్కువ వ్యయం అవుతుందని అంచనా వేశారు అధికారులు. ఇది చర్చల దశలో ఉంది. దీనితోపాటుగా మరికొన్ని ప్రాజెక్టులపై సమీక్షలు జరుగుతున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


