...
...
Next Story

SCR Special Trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్... హైదరాబాద్-మంగళూరు స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు

SCR Special Trains Extension : హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

Published on: Jul 26, 2026, 09:29:36 IST
Advertisement

SCR Special Trains Extension : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి దక్షిణ భారతంలో ఉన్న ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో పలు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా… హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు పొడిగింపు
ప్రత్యేక రైళ్లు పొడిగింపు

వేసవి ప్రయాణాలు, పండుగల సీజన్ దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. సీట్లు త్వరితగతిన నిండిపోతుండటం, వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుండటంతో ఈ సేవా కాలాన్ని మరికొన్ని వారాల పాటు పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

పొడిగించిన రైళ్ల వివరాలు :

  • హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ ప్రత్యేక రైలు (నంబర్ 07097) : ఈ ప్రత్యేక రైలు ఆగస్టు 5, 12, 19, 26 తేదీలలో (ప్రతి బుధవారం) హైదరాబాద్ స్టేషన్ నుంచి మంగళూరు సెంట్రల్‌కు బయలుదేరుతుంది.
  • మంగళూరు సెంట్రల్ - హైదరాబాద్ ప్రత్యేక రైలు (నంబర్ 07098) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఆగస్టు 6, 13, 20, 27 మరియు సెప్టెంబరు 3వ తేదీలలో (ప్రతి గురువారం) మంగళూరు సెంట్రల్ నుంచి హైదరాబాద్‌కు తన సేవలను అందిస్తుంది.

స్టాపేజీలు…

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గుండా సాగే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, గుంతకల్, అనంతపురం, యలహంక, కృష్ణరాజపురం, సేలం, పాలక్కాడ్, కోళికోడ్, వడకర, కాసర్‌గోడ్ స్టేషన్లు ఉన్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe