కనీసం పదో తరగతి కూడా పాస్ కాలేదు.. కానీ 20 ఏళ్లుగా డెంటిస్ట్‌‌గా సేవలు!

Fake Dentist : హైదరాబాద్‌లో ఫేక్ డెంటిస్ట్ బాగోతం బయటపడింది. కనీసం పదో తరగతి కూడా పాస్ అవ్వని వ్యక్తి.. 20 ఏళ్లుగా డెంటిస్ట్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

Published on: Mar 24, 2026, 22:25:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పదో తరగతి కూడా పాస్ అవ్వని వ్యక్తి..డెంటిస్ట్‌గా చెలామణి అవుతున్నాడు. ఎంతో మంది పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేశాడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అందరూ ఉదయం నుంచి రాత్రివరకు క్లీనిక్ రన్ చేస్తుంటే.. అతడు మాత్రం రాత్రి నుంచి ఉదయం వరకు క్లీనిక్ ఓపెన్ చేసి పెడతాడు. ఈ మోసగాడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నకిలీ దంత వైద్యుడు అరెస్ట్
నకిలీ దంత వైద్యుడు అరెస్ట్

హైదరాబాద్‌లో నేరెడ్‌మెట్‌కు 20 ఏళ్ల క్రితం రమేశ్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు. తాను డెంటిస్ట్‌నని నేరెడ్‌మెట్‌లో దుకాణం తెరిచాడు. ఇక అప్పటి నుంచి ఈ పది పాస్ కానీ.. డెంటిస్ట్.. పేషెంట్లకు సేవలు అందిస్తూనే ఉన్నాడు. మార్చి 24న మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(SOT) జరిపిన దాడుల్లో అతని అక్రమ క్లినిక్ బయటపడటంతో అరెస్టు చేశారు.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఈ ఫేక్ డెంటిస్ట్ రమేష్.. 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు. కానీ నకిలీ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) సర్టిఫికేట్లను ఉపయోగించి అర్హత కలిగిన దంతవైద్యుడిగా చెప్పుకుంటూ వస్తున్నాడు. విచారణలో తేలిన విషయం ఏంటంటే.. రమేష్ ప్రధానంగా అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు క్లినిక్‌ను నడుపుతాడు. ఈ అసాధారణమైన పనివేళలతో ఇటీవల కొందరి అనుమానం కూడా వచ్చింది.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇటీవల శంషాబాద్‌లో పెద్ద ఆసుపత్రి పెట్టేందుకు కూడా ప్లాన్ చేశాడు. ఈ ఫేక్ డెంటిస్ట్‌పై స్థానిక వైద్యులకు కూడా అనుమానం వచ్చింది. ఆ తర్వాత రమేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువు కూడా పూర్తి చేయకపోయినా.. తనను తాను అర్హత కలిగిన దంతవైద్యుడిగా పరిచయం చేసుకుని, సంవత్సరాల తరబడి రోగులకు చికిత్స అందించాడు.

ఎస్ఓటీ అధికారులు రమేష్ క్లినిక్‌పై దాడి చేసి.. రమేష్‌కు ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హత లేదని, అతను దాదాపు 20 ఏళ్లుగా అక్రమంగా దంతవైద్యం చేస్తున్నాడని నిర్ధారించుకున్నారు. ఇన్నాళ్లు ఎవరికీ తెలియకుండా తన కార్యకలాపాలను ఎలా కొనసాగించగలిగాడు? అమాయక రోగులపై ఏ స్థాయిలో చికిత్సలు చేశాడు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More