హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఐటీ కంపెనీలు, సంస్థలు విడతల వారీగా కార్యాలయాల నుంచి ఉద్యోగులను ముందుగానే పంపాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడటం దీని ముఖ్య ఉద్దేశం.

'నగరంలో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఐటీ కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులను విడతల వారీగా ముందుగానే ఆఫీసు నుంచి వెళ్లేందుకు అనుమతించాలి.' అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటన జారీ జారీ చేశారు.
రహదారి మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని తగ్గించడం, ప్రయాణ సంబంధిత ప్రమాదాలను స్థాయికి తగ్గించడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు ముందుగానే ఆఫీసుల నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ వ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణకు వీలుగా, కంపెనీలు తమ కార్యాలయాల స్థానాలను, ప్రతిపాదిత ముందస్తు లాగౌట్ సమయాలను ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని కూడా కోరారు.
రాబోయే భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్ను సజావుగా నిర్వహించేందుకు, ఈ సలహాను అమలు చేయడంలో సహకరించాలని సంస్థలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఐఎండీ హైదరాబాద్ ప్రకారం సోమవారం పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 33 డిగ్రీల సెల్సియస్గా నమోదైన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇది గణనీయమైన తగ్గుదలగా ఉంది.
హైదరాబాద్లోనూ వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్లలో సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. అనవసరంగా బయటకు రావడం మానుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం అయ్యారు. డ్రైనేజీ వ్యవస్థలలో నీరు నిలవడాన్ని తనిఖీ చేస్తున్నారు.
{{/usCountry}}హైదరాబాద్లోనూ వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్లలో సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. అనవసరంగా బయటకు రావడం మానుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం అయ్యారు. డ్రైనేజీ వ్యవస్థలలో నీరు నిలవడాన్ని తనిఖీ చేస్తున్నారు.
{{/usCountry}}