తెలంగాణ ప్రభుత్వ పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర సర్వీసుల్లో డెప్యుటేషన్పై ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం తిరిగి సొంత కేడర్ అయిన తెలంగాణకు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఢిల్లీతో పాటు హైదరాబాద్ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

సంజయ్ జాజు 1992 బ్యాచ్కు చెందిన భారత పరిపాలనా సేవా (IAS) అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను రాష్ట్రానికి కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రత్యేకంగా అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ … ఆయనను తిరిగి సొంత కేడర్కు పంపేందుకు తక్షణమే ఆమోదం తెలిపింది.
సంజయ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సబ్కలెక్టర్గా, పశ్చిమగోదావరి కలెక్టర్గా పని చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా, కమిషనర్గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. జాజును సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఉత్తర్వులు జారీ అయితే….. ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉంటారు.
ఈనెలతో ముగియనున్న గడువు…
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పొడిగించిన పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర తదుపరి సీఎస్ ఎవరనే దానిపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ సాగుతోంది. రామకృష్ణారావు పదవీ విరమణ సమయం దగ్గర పడటంతో, పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా అనుభవజ్ఞుడైన సంజయ్ జాజును రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
సంజయ్ జాజుకు కేంద్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ శాఖల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ ఏడాది మార్చిలోనే ఆయనను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అంతకుముందు ఆయన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా కూడా సేవలందించారు.
{{/usCountry}}సంజయ్ జాజుకు కేంద్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ శాఖల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ ఏడాది మార్చిలోనే ఆయనను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అంతకుముందు ఆయన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా కూడా సేవలందించారు.
{{/usCountry}}