Moinabad Drugs Case : మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం - సిట్ ఏర్పాటు
మెయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. మొత్తం 9 మంది అధికారులు ఇందులో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మెయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. అయితే ఈ కేసును సిట్ తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సిట్ చీఫ్ గా చేవెళ్ల డీసీపీ
సిట్ చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వ్యవహరిస్తారు. గ్రేహౌండ్స్ కమాండర్ ఎం.రవీందర్, షాదనగర్ డీసీపీ శిరీష, ఈగల్ డీఎస్పీలు బుచ్చయ్య, హరీశ్ చంద్రారెడ్డి, మోయినాబాద్ ఎస్హెచ్వో మల్లిఖార్జున, ఎస్ఐలు కోటేశ్వర్ రావు, వెంకన్న, సదత్ అలీ సభ్యులుగా ఉన్నారు.
బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో మద్యం పార్టీ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఫామ్హౌస్లో డ్రగ్ పార్టీ జరుగుతోందని విశ్వసనీయ సమాచారం మేరకు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (EAGLE) ఫోర్స్, పోలీసు బృందం శనివారం రాత్రి దాడి చేశాయి. ఈ పార్టీకి రియల్టర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కూడా హాజరైనట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. పాల్గొన్న వారిలో ఒక మహిళ కూడా ఉంది. రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.
పాజిటివ్ వచ్చిన వారిలో ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, పైలట్ రోహిత్రెడ్డి ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
ఈ ఘటనపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు. రోహిత్రెడ్డి, రితేశ్రెడ్డి, నమిత్శర్మలను కోర్టులో ప్రవేశపెట్టగా… 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులోని తీవ్రత దృష్ట్యా…. సిట్ తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు ఈ వ్యవహరంపై సిట్ ఏర్పాటైన నేపథ్యంలో… కేసును మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. అయితే ప్రధాన నిందితులను కస్టడీ కోరే అవకాశం ఉంది. మరోవైపు రితేశ్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని సైబరాబాద్ కమిషనర్కు సిట్ లేఖ రాసింది. అంతేకాకుండా…. ఫామ్హౌస్కు సంబంధించిన వివరాలను రెవెన్యూ శాఖ నుంచి సేకరించే పనిలో ఉన్నట్లు తెలిసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

